
15 మందితో కూడిన కుటుంబం
అవి కు టుంబంలో ఉండే సమస్యల్లాంటివేనని చెప్పింది. ‘సహాయ సిబ్బందిని కూడా కలిపితే అది జట్టుకాదు.. 15 మందితో కూడిన కుటుంబం. సహజంగానే ఫ్యామిలీలో అభిప్రాయ భేదాలుంటాయి. అందరికీ ఒకే రకమైన ఆలోచనలు ఉండవు. గతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. కానీ మళ్లీ అలాంటి పరిస్థితులు చోటు చేసుకోవని' శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్ చెప్పింది.

మహిళల క్రికెట్కు మంచిది కాదు
‘తుది జట్టులో చోటు, కోచ్తో వివాదం ఇంత పెద్దదవడం మహిళల క్రికెట్కు మంచిది కాదు. ఆటతీరు కంటే క్రికెటేతర అంశాలే చర్చనీయాంశం కావడం... ఆటకు ఇబ్బందికరం. కివీస్ పర్యటన కోసం సన్నద్ధం కావాలి. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలి' అని హైదరాబాదీ స్టార్ బ్యాట్స్మన్ చెప్పింది. టీ20 వరల్డ్కప్ సందర్భంగా కోచ్ రమేష్ పొవార్, మిథాలీ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి.రాజ్పై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు వచ్చే నెలలో జరగనున్న న్యూజిలాండ్ టూర్కు ఆమెనే వన్డే టీమ్ కెప్టెన్గా కొనసాగించడంతోపాటు టీ20ల్లోనూ చోటు కల్పించారు.

కోచ్ రామన్కు సహకారం అందించాలి
‘జరిగిన పరిణామాలు ఎవరికీ మంచివి కావు. పరిస్థితులు కుదుటపడ్డాయని కచ్చితంగా చెప్పగలను. ఇక ఆటపైనే దృష్టంతా' అని రాజ్ చెప్పింది. కొత్త కోచ్ డబ్ల్యూవీ రామన్కు తగిన సహకారం అందించాల్సిన అవసరం ఉందని మిథాలీ వివరించింది. క్రికెటర్లు, సహాయ సిబ్బంది అంతా కలిసి ఓ క్రికెట్ కుటుంబంగా మెలుగుతామని, అయితే అప్పుడప్పుడు భేదాభిప్రాయాలు రావడం సహజమని చెప్పింది.

ఇంతకుముందు జాతీయ క్రికెట్ అకాడమీలో కలిశా
‘ఒక కుటుంబంలో అందరూ ఒకేలా ఆలోచించరు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అయితే ఆట ముందు ఇవన్నీ పెద్ద సమస్యలేమీ కావు. మా ప్రాధాన్యం క్రికెటే. ఓసారి బరిలోకి దిగగానే ఆటే మా సర్వస్వమవుతుంది. ఆటలో నెగ్గేందుకు అంతా ఒక్కటవుతాం. అప్పుడు జట్టే కనిపిస్తుంది. మంచి ప్రదర్శనే మా లక్ష్యమవుతుంది. ఇతరత్రా అంశాలేవీ గుర్తుండవు' అని మిథాలీరాజ్ తెలిపింది. కొత్త కోచ్ డబ్ల్యూవీ రామన్పై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని, ఇంతకుముందు జాతీయ క్రికెట్ అకాడమీలో కలిశానని పేర్కొంది. జనవరి 24న ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.


Click it and Unblock the Notifications












