
హైదరాబాద్: సఫారీ గడ్డపై టెస్టు సిరిస్ను గెలిచి చరిత్ర సృృష్టించాలని టీమిండియా ఊవిళ్లూరుతోంది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టు కోసం టీమిండియా తీవ్రంగా నెట్స్లో శ్రమిస్తోంది.
తొలి టెస్టు ఆరంభంకానున్న నేపథ్యంలో ఇండోర్ నెట్స్లో టీమిండియాప్రాక్టీస్ చేస్తుండగా తీసిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ని కూడా గెలవని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టెస్టు సిరిస్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కెప్టెన్గా గతేడాది ఒక్క టెస్టు సిరీస్ని కూడా చేజార్చుకోని విరాట్ కోహ్లీ, అదే జోరుని ఈ ఏడాది కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. గత రెండు రోజులుగా కేప్ టౌన్లో వర్షం పడుతుండటంతో ఇండోర్లో ఏర్పాటు చేసిన నెట్స్లో భారత్ ప్రాక్టీస్ చేస్తున్న తీరుని రోహిత్ శర్మ అభిమానులకు వివరించాడు.