
మాతో ఉంటే తప్పేంటి:
విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న రోహిత్ ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరంగా ఉన్నాడు. ఈ విలువైన సమయాన్ని తన కుటుంబంతో గడుపుతున్నాడు. అయితే ప్రపంచకప్ సమయంలో చోటు చేసుకున్న వివాదం గురించి సోమవారం ఓ ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడాడు. 'ఫ్యామిలీలు మాకు అండగా ఉంటాయి. మమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మాతో ఉంటే తప్పేంటి. మా కుటుంబ సభ్యులకు నిర్ణయించిన రోజుల కంటే ఎక్కువ రోజులు మాతో ఉన్నారని వార్తలు రాశారు. మా ఫ్యామిలీల గురించి మీకు ఎందుకు' అని రోహిత్ మండిపడ్డాడు.

నా వరకే పరిమితం చేయండి:
'మా కుటుంబల గురించి వార్తలు రాస్తున్నారని స్నేహితులు చెబితే నవ్వుకున్నా. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ నా గురించి ఏమైనా రాయాలనుకుంటే.. దాన్ని నా వరకే పరిమితం చేయండి. ఫలానా వాళ్లు మా గురించి ఏదో అంటున్నారని రాస్తే దాన్ని మేము లెక్కచేయాల్సిన పనిలేదు. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఇదే విషయంపై మాట్లాడాడు. కుటుంబాలు అనేవి మా జీవితంలో కూడా చాలా ముఖ్యమైనవే. ఇది తెలుసుకోండి' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఎంతో సంతోషంగా ఉన్నా:
'ఆలోచనల పరంగా నేను కాస్త విభిన్నం. నా భార్య (రితిక), కూతురు (సమైరా)తో జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నా. ఎవరో ఏదో మాట్లాడుతున్నారన్న బెంగ లేదు. నా కుటుంబం ఎనలేని ప్రేమ, ఆప్యాయత నాపై చూపిస్తుంటే.. ఎవరో అన్న మాటల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. చెడు మాట్లాడుకున్నా పట్టించుకునే స్థాయిని దాటిపోయా. అవి నాపై ఎలాంటి ప్రభావం చూపవు' అని రోహిత్ పేర్కొన్నాడు.

జయసూర్య రికార్డు బద్దలు:
గతేడాది మూడు ఫార్మాట్లలో ఓపెనర్గా మొత్తం 2,442 పరుగులు చేసిన 'హిట్మ్యాన్' అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. 22 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న లంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య రికార్డు బద్దలు కొడ్తాడు. టెస్టుల్లోనూ ఓపెనర్గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే రెండు శతకాలతో చోటు ఖాయం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications
