విండీస్తో సిరీస్కు రెడీ
ప్రస్తుతం ఎన్సీఏలో రోహిత్ వేగంగా కోలుకుంటున్నాడని, విండీస్తో సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. విండీస్తో వన్డే సిరీస్కు ప్రారంభం కావడానికి ఇంకా 3 వారాల సమయం ఉందని, ఆ లోపు హిట్మ్యాన్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాయి. కాగా సౌతాఫ్రికా పర్యటనకు ముందు నెట్ సెషన్లో రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే.
అతని తొడ కండరాలు పట్టేయడంతో సౌతాఫ్రికా పర్యటనకుదూరమయ్యాడు. మొదట టెస్టు సిరీస్కు మాత్రమే దూరమవుతాడని, వన్డేలకు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. కానీ పూర్తి ఫిట్నెస్ సాధించక పోవడంతో వన్డే సిరీస్కు కూడా దూరమయ్యాడు.
సిరీస్ షెడ్యూల్
ఇండియా, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 6 నుంచి 20 మధ్య వన్డే, టీ సిరీస్లు జరగనున్నాయి. భారత్ వేదికగా జరగనున్న ఈ సిరీస్లో ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనున్నాయి. ఫిబ్రవరి 6న తొలి వన్డే, 9న రెండో వన్డే, 12న మూడో వన్డే జరగనుంది. ఇక ఫిబ్రవరి 15న తొలి టీ20, 18న రెండో టీ20, 20న మూడో టీ20 జరగనుంది.
టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ
ఇప్పటికే టీమిండియా వన్డే, టీ20 జట్లకు కెప్టెన్గా నియమించబడ్డ రోహిత్ శర్మ త్వరలోనే టస్టు కెప్టెన్గా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఆ బాధ్యతలు రోహిత్కే అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు కూడా జరిగే అవకాశాలు లేవు. కనుక ప్రస్తుతం వన్డే, టీ20లకు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మనే టెస్టులకు కూడా కెప్టెన్గా నియమించే ఆలోచనలో సెలెకర్టు ఉన్నట్లు సమాచారం. అయితే వయస్సు ఎక్కువ కావడం రోహిత్ కాస్త మైనస్ పాయింట్.
పంత్, రాహుల్ నుంచి పోటీ
టెస్టు కెప్టెన్సీకి రోహిత్ శర్మకు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ నుంచి పోటీ ఉంది. రాహుల్ లేదా పంత్కు కెప్టెన్సీ అప్పగిస్తే సుదీర్ఘ కాలం కెప్టెన్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. కానీ రోహిత్తో పోలిస్తే వీరి సక్సెస్ రేట్ కెప్టెన్గా చాలా తక్కువ. పంత్ నేర్చుకోవల్సింది ఇంకా చాలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చివరగా టెస్టు కెప్టెన్సీ ఎవరికీ దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది.