హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డుకి ఒక సిక్స్ దూరంలో నిలిచాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ పర్యటనకు తెరలేచింది. రెండు టీ20ల సిరిస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి తొలి టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకుని భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
విశాఖలో తొలి టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా రికార్డు సృష్టించేవాడు. కనీసం ఒక్క సిక్స్ కొట్టినా మార్టిన్ గుప్టిల్(న్యూజిలాండ్), క్రిస్ గేల్(వెస్టిండిస్)తో సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకునేవాడు. అయితే, ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ(5) జట్టు స్కోరు 14 పరుగుల వద్ద ఆడమ్ జంపా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.
WICKET! Behrendorff has the breakthrough, with Rohit Sharma sweeping to Adam Zampa at fine leg #INDvAUS https://t.co/vHl4XsuVm4
— cricket.com.au (@cricketcomau) February 24, 2019
దీంతో టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ రికార్డుని మిస్ చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాను ఓసారి పరిశీలిస్తే న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్, వెస్టిండిస్ ఓపెనర్ క్రిస్గేల్ 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ప్రస్తుతం 102 సిక్సర్లతో ఉన్న రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, భారత్ తరఫున టీ20ల్లో రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డ్లో అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత యువరాజ్ సింగ్ 72 సిక్సర్లతో ఉన్నాడు. టీమిండియా తరఫున టాప్-10లో ఈ ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఉన్నారు.