
అగ్రస్థానంలో షోయబ్ మాలిక్
కాగా, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్(111) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, మహిళల క్రికెట్లో భారత్ నుంచి హర్మన్ ప్రీత్ కౌర్(100) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. బంగ్లాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్కు రోహిత్ కెప్టెన్గా వ్వవహారిస్తున్నాడు.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్
పనిభారం కారణంగా బంగ్లా సిరిస్ నుంచి సెలక్టర్లు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, తొలి టీ20లో రోహిత్ శర్మ 9 పరుగులకే ఔటైనప్పటికీ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీని అధిగమించాడు. టీ20ల్లో రోహిత్ శర్మ(2,452) పరుగులు చేశాడు. రోహిత్తో పోలిస్తే కోహ్లీ కేవలం 2 పరుగుల మాత్రమే వెనుకంజలో ఉన్నాడు.

2 పరుగుల వెనుకంజలో కోహ్లీ
ఆ తర్వాత మార్టిన్ గుప్టిల్(2,326), షోయబ్ మాలిక్(2,63), బ్రెండన్ మెక్కల్లమ్(2,140) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, తొలి టీ20లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియాతో ఇంతకముందు జరిగిన 8 టీ20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్కు టీ20ల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం.

రాజ్కోట్ వేదికగా రెండో టీ20
అంతేకాదు ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 సిరిస్ ఇదే కావడం విశేషం. తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 నవంబర్ 7న రాజ్ కోట్ వేదికగా జరగనుంది. దీంతో రెండో టీ20లో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేయాలనే గట్టి పట్టుదలతో రోహిత్ సేన ఉంది.


Click it and Unblock the Notifications
