సూపర్ ఫామ్లో రోహిత్ శర్మ
ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్లో సైతం చక్కటి ఫామ్లో ఉన్నాడు. ఈ క్రమంలో తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ముంగిట ఇప్పుడు మరో ప్రపంచ రికార్డు నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్లో మరో రెండు సిక్సర్లు కొడితే భారత్ తరఫున నాలుగొందల సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టిస్తాడు.
రెండో టీ20లో ఆరు సిక్సర్లు బాదిన రోహిత్
బంగ్లాదేశ్తో రాజ్కోట్ వేదికగా గురువారం రాత్రి ముగిసిన రెండో టీ20లో ఆరు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో 398 సిక్సర్లు బాదాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఆదివారం ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 నాగ్పూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరో రెండు సిక్సర్లు బాదితే అరుదైన ఘనత సాధిస్తాడు.
భారత్ తరుపున 400 సిక్సర్లు
భారత్ తరుపున 400 సిక్సర్లు బాదిన మొదటి క్రికెటర్గా మొత్తంగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మూడో క్రికెటర్గా నిలుస్తాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో విండిస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్గేల్ 534 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
సిరిస్ 1-1తో సమం
మూడు టీ20ల సిరిస్లో భాగంగా రెండో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో సిరిస్ 1-1తో సమం అయింది. ఆఖరి టీ20లో గనుక బంగ్లాదేశ్ విజయం సాధిస్తే చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే టీ20 క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ ఇప్పటివరకు భారత్పై టీ20 సిరిస్ నెగ్గలేదు.