ముంబై: భారత క్రికెటర్ రోహిత్ శర్మ నిశ్చితార్థం ముంబైలో ఘనంగా జరిగింది. కుటుంబసభ్యుల సమక్షంలో చిరకాల స్నేహితురాలు రితికా సజ్దేతో నిశ్చితార్థం వేడుక జరిగింది.

రితిక సజ్దేతో రోహిత్ నిశ్చితార్థం బుధవారం ఇరు కుటుంబాల వారు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ హీరో సొహైల్ ఖాన్ హాజరయ్యాడు.

28 ఏళ్ల రితిక స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్గా పని చేస్తున్నారు. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులే అయినా, పెళ్లికి ప్రపోజ్ చేసింది మాత్రం రోహితే.
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్ సారథి) ఆడిన మ్యాచులకు రితికా హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్ ఐపిఎల్ ఛాంపియన్గా ముంబై ఇండియన్స్ నిలిచింది.