
ఇంగ్లాండ్ పర్యటనలో మురళీ విజయ్ విఫలం
ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో వరుసగా రెండు టెస్టుల్లో అతను ఫెయిలవడంతో.. అతడ్ని తప్పించిన సెలక్టర్లు యువ ఓపెనర్ పృథ్వీ షాకి అవకాశమిచ్చారు. వెస్టిండిస్తో ఇటీవలే ముగిసిన రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో పృథ్వీ షా తన అరంగేట్ర టెస్టులోనూ సెంచరీతో సత్తాచాటాడు. రెండో టెస్టులో సైతం హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ ముగ్గురి ఎంపికపై ఎమ్మెస్కే ప్రసాద్ ఇలా
దీంతో ఓపెనర్గా మురళీ విజయ్ ఇప్పట్లో పునరాగమనం చేయడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకి మురళీ విజయ్ని సెలక్టర్లు ఎంపిక చేసి ఆశ్చర్యపరిచారు. హనుమ విహారికి మరో అవకాశం దక్కింది. ఈ ముగ్గురి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తనదైన శైలిలో స్పందించారు.
రోహిత్ శర్మ బ్యాక్ఫుట్పై చాలా బాగా ఆడతాడు
"ఇంగ్లాండ్తో సిరీస్ తర్వాత కఠినంగా శ్రమించిన మురళీ విజయ్ ఫామ్ అందుకున్నాడు. అందుకే అతడ్ని ఎంపిక చేశాం. ఇక రోహిత్ శర్మ గురించి చెప్పాలంటే.. అతను బ్యాక్ఫుట్పై చాలా బాగా ఆడతాడు. ఆస్ట్రేలియా పిచ్లకి రోహిత్ ఆట బాగా సరిపోతుంది. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో పార్థీవ్ పటేల్ బ్యాట్తో మెరుగ్గా రాణించాడు. ఇలా ముగ్గురూ ఇటీవల ఫామ్ని చాటుకోవడంతో ఆస్ట్రేలియా పర్యటనకి ఎంపిక చేశాం" అని అన్నాడు.
కీపర్లుగా పంత్, పార్ధీవ్ పటేల్
ఆస్ట్రేలియా సిరిస్లో రిషబ్ పంత్తో పాటు పార్థివ్ పటేల్ కీపర్లుగా వ్యవహరించనున్నాడు. నవంబరు 21న ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. దీంతో పాటు న్యూజిలాండ్ ఎతో 15 మందితో భారత్ ఎ జట్టును ప్రకటించారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు భారత జట్టు:
కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, రాహుల్, పృథ్వీ షా, పుజారా, రహానె, హనుమ విహారి, రోహిత్, పంత్, పార్థివ్ పటేల్, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, షమీ, ఇషాంత్, ఉమేష్, బుమ్రా, భువనేశ్వర్.


Click it and Unblock the Notifications












