Rohit Sharma: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడినప్పుడల్లా చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ ఐపీఎల్ మ్యాచ్లలో చాలా మంది గొప్ప బ్యాటర్లు అధ్బుతంగా రాణించారు. కానీ కొంతమంది ఆటగాళ్ల రికార్డు ప్రత్యేకమైనది. అలాంటి వారిలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకరు. రోహిత్ శర్మ కోల్కతా నైట్ రైడర్స్పై అద్భుతంగా రాణించాడు.
ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్పై రోహిత్ శర్మ 900 పరుగులు సాధించాడు. అయితే ఐపీఎల్ 2025లో మొదటి రెండు మ్యాచ్లలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫున బాగా రాణించలేకపోయాడు. కానీ ఇప్పుడు వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో రోహిత్ శర్మకు అరుదైన రికార్డును సాధించే సువర్ణావకాశం లభించనుంది.

1000 పరుగులకు దగ్గరగా రోహిత్ శర్మ
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లలో రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఈడెన్ గార్డెన్స్ అయినా, వాంఖడే స్టేడియం అయినా రోహిత్ శర్మ ఎప్పుడూ కోల్కతాపై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పటివరకు కేకేఆర్పై రోహిత్ శర్మ 954 పరుగులు చేశాడు. రోహిత్ స్ట్రైక్ రేట్ 128.05గా ఉంది. ఈ రోజు మ్యాచ్లో రోహిత్ శర్మ ఇంకా 46 పరుగులు చేస్తే 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించనున్నాడు. ఇప్పుడు హిట్ మ్యాన్ ఈ చారిత్రాత్మక ఘనతను సాధించగలడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
కేకేఆర్పై ఎక్కువ రన్స్ చేసిన భారత ఆటగాళ్లు వీరే..
1.రోహిత్ శర్మ-954
2.సూర్యకుమార్ యాదవ్-590
3.వెంకటేశ్ అయ్యర్ -362
4. గౌతమ్ గంభీర్-349
5.మనీష్ పాండే -327
తొలి గెలుపు కోసం చూస్తున్న ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో బాగా రాణించలేకపోయాడు. మొదటి మ్యాచ్లో రోహిత్ శర్మ ఎలాంటి పరుగులు చేయకుండానే ఔటయ్యాడు. రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ అభిమానులు రోహిత్ మూడో మ్యాచ్ లో బాగా బ్యాటింగ్ చేస్తాడని ఆశిస్తున్నారు. తద్వారా ముంబై జట్టు ఈ సీజన్ లో తొలి విజయాన్ని సాధించగలదు. ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. ఈ కారణంగా ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇప్పుడు ముంబై తన తొలి విజయాన్ని నమోదు చేయగలదా లేదనా అనేది చూడాలి.