సిక్సర్ తగిలింది:
రోహిత్ ఒకవైపు పరుగుల సునామీ సృష్టిస్తూ .. మరోవైపు తన మంచి మనుసుతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఓ అభిమానిని సర్ప్రైజ్ చేశాడు. విషయంలోకి వెళితే... మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలో రోహిత్ కొట్టిన ఓ సిక్సర్ ఓ మహిళా అభిమానికి తగిలింది. సెంచరీ అనంతరం పెవిలియన్ చేరేటప్పుడు ఆగి.. తను కొట్టిన బంతి ఎవరికి తగిలిందో చెప్పాల్సిందిగా కోరాడు.

కానుకగా టోపీ:
మ్యాచ్ పూర్తయిన అనంతరం రోహిత్ ఆమెను పరామర్శించారు. తన జ్ఞాపకంగా ఆ అభిమానికి సంతకం చేసిన టోపీని కానుకగా ఇచ్చారు. ఆమెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హిట్మ్యాన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకే రోహిత్కి అభిమానులు ఎక్కువ అంటూ పొగిడేస్తున్నారు.
ఉత్కంఠ విజయం:
ఈ మ్యాచ్లో టీమ్ఇండియా 28 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. రోహిత్ శర్మ (104) రికార్డు సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (77) రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ (66), సైఫుద్దీన్ (51 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. బుమ్రా 4, హార్దిక్ 3 వికెట్లు తీశారు. సెంచరీ చేసిన రోహిత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు.


Click it and Unblock the Notifications
