హైదరాబాద్: ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ముగియడంతో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తన భార్య రితకాతో కలిసి విహార యాత్రలో మునిగిపోయాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే, మూడు టీ20లు, మూడు వన్డేల సిరిస్ ముగిసింది. మూడు టీ20ల సిరిస్ను కోహ్లీసేన కైవసం చేసుకోగా.... మూడు వన్డేల సిరిస్ను ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. ఆగస్టు 1 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రారంభం కానుంది.
మొదటి మూడు టెస్టుల కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. దీంతో రోహిత్శర్మ ప్రస్తుతం తన భార్యతో కలిసి ప్రాగ్లో విహరిస్తున్నాడు. తన భార్య రితికతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
"ప్రాగ్ అందమైన నగరంలో విహరిస్తున్నానా" అంటూ ఓ ఫొటోను రోహిత్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అయితే, ఈ పోస్టుకు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ 'మిస్ యు రోహితా.... శర్మా'.. అంటూ పేరును సాగదీస్తున్నట్లుగా ఆ ఫొటోకు కామెంట్ పెట్టాడు.
Exploring the beautiful city of Prague #PragueOldTown 👀
A post shared by Rohit Sharma (@rohitsharma45) on
చాహాల్ కామెంట్కు రోహిత్ భార్య రితిక తిరిగి రిప్లై ఇచ్చింది. 'యూజీ.. ప్రస్తుతం రోహిత్ నావాడు' అంటూ రితికా సమాధానమిచ్చింది. ఇటీవల టీమిండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ భార్యలతో కలిసి లండన్లో విహరించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.
టెస్టుల్లో రోహిత్ శర్మ కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు. పరిమిత ఓవర్లలో రాణిస్తున్నప్పటికీ, టెస్టుల్లో మాత్రం జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు 25 టెస్టు మ్యాచ్లాడిన రోహిత్ శర్మ కేవలం 1,479 పరుగులు మాత్రమే సాధించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మ యావరేజి 40 కంటే తక్కువగా ఉండటం విశేషం.