
ధోనీ రికార్డును బద్దలు:
రెండో టీ20 మ్యాచ్లో రోహిత్ ఆరు సిక్సుర్లు కొట్టడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (37) బాదిన భారత కెప్టెన్గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు ధోనీ (34) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ధోనీ 62 ఇన్నింగ్స్లో 34 సిక్సర్లు బాదగా.. రోహిత్ కేవలం 17 ఇన్నింగ్స్లోనే 37 సిక్సర్లు బాదాడు. ఇక 26 ఇన్నింగ్స్లో 26 సిక్సర్లతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు:
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ల జాబితాలో మాత్రం రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ (534) టాప్లో ఉండగా.. పాకిస్తాన్ హిట్టర్ షాహిద్ అఫ్రిది (476) రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (398), మెకల్లం (398)లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

కోహ్లీతో సమంగా:
23 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన రోహిత్.. అంతర్జాతీయ టీ20ల్లో తన రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును కూడా సమం చేశాడు. 22వ అర్ధ సెంచరీతో విరాట్ కోహ్లీతో కలిసి సమంగా నిలిచాడు. కెప్టెన్గా ఇద్దరూ ఆరు అర్థ సెంచరీలు చేశారు.

బౌలర్లను తక్కువగా అంచనా వేయను:
మ్యాచ్ అనన్తరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'స్పిన్నర్లు పిచ్ను బాగా అర్థం చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. గత మ్యాచ్ తప్పులను సరిదిద్దుకున్నాం. వికెట్ బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంది. ఇక్కడ రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ కష్టంగా మారిపోతుందని తెలుసు. దానిని సద్వినియోగం చేసుకుని పవర్ప్లేలో రెచ్చిపోయాం. నేను బౌలర్లను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయను. ఇన్నేళ్లుగా నాకు తెలిసిన ఒకే ఒక పని.. బ్యాట్ చేతిలో ఉన్నప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో బంతిని బలంగా బాదాలని నిర్ణయించుకున్నా' అని అన్నాడు.


Click it and Unblock the Notifications












