మాంఛెస్టర్: ఈ ఫొటోలో కనిపిస్తోన్నది మరెవరో కాదు..వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. అతని ఎదురుగా అల్లరి చేస్తూ కనిపిస్తోన్న ఆ చిన్నారి టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో సందడి చేస్తూ కనిపించారు. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ఇండియన్ స్క్వాడ్లో రిషబ్ పంత్కు మొదట్లో చోటు దక్కలేదు. కొద్దిరోజులకే- అతనికి పిలుపొచ్చింది.
ఇంగ్లండ్ జట్టుకు ఎదురు దెబ్బ! గాయపడ్డ ఆల్రౌండర్..మ్యాచ్లకు దూరం!
ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా వేలికి గాయం కావడంతో జట్టుకు దూరమైన శిఖర్ ధావన్ స్థానంలో రిషబ్ పంత్ను ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. దీనితో రిషబ్ పంత్ హుటాహుటిన ఇంగ్లండ్కు బయలుదేరి వెళ్లాడు. జట్టుతో కలిశాడు. అతనికి మ్యాచ్ ఆడే ఛాన్స్ ఇంకా దక్కలేదు. శిఖర్ ధావన్ స్థానంలో కన్నడిగుడు కేఎల్ రాహుల్.. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్ ఆరంభించడం, భారీ స్కోరు చేయడంతో రిషబ్ పంత్ ఇక 12వ ఆటగాడిగానే మిగిలిపోవచ్చు.
ఇదిలావుండగా- భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా రిజర్వ్ బెంచ్లో ఉన్న రిషబ్ పంత్.. ధోనీ కుమార్తె జివాతో కలిసి సరదాగా గడిపాడు. ఆ చిన్నారితో కలిసి స్టేడియంలో సందడి చేస్తూ కనిపించాడు. జివాతో కలిసి గట్టిగా కేకలు వేస్తూ, ఆమెతో పోట్లాడుకుంటూ స్టేడియంలో హల్చల్ చేశాడు రిషబ్ పంత్. దీనికి సంబంధించిన ఓ వీడియోను అతను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్గా మారింది.
View this post on InstagramPartners in crime 😈 @ziva_singh_dhoni
A post shared by Rishabh Pant (@rishabpant) on