
హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన నాలుగో వన్డేలో భారత్-ఏ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 73 పరుగులతో నాటౌట్గా నిలవడంతో ఇండియా-ఏ జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
దీంతో ఐదు వన్డేల సిరిస్లో ఇండియా-ఏ జట్టు 4-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ (4/49), దీపక్ చాహర్ (2/38) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ లయన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసి కుప్పకూలింది.
ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో పోప్ (65), ములానే (58 నాటౌట్) రాణించారు. అనంతరం 222 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టులో రిషబ్ పంత్ (73 నాటౌట్), హూడా (47 నాటౌట్), కేఎల్ రాహుల్ (42) రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.