For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్‌ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!

Rishabh Pant, Shubman Gill shine India beat Australia to win series
Ind vs Aus 4th Test : History At Gabba,India Defeat Australia By 3 Wickets,Win Series 2-1

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టీమిండియా చరిత్ర సృష్టించింది. 32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని బ్రిస్బేన్‌లో కంగారూల ప‌ని ప‌ట్టింది. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్ధేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ భారత్ 2-1తో కైవసం చేసుకుంది. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ ‌అర్ధ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్​ గిల్‌, నయావాల్ ఛెతేశ్వర్‌ పుజారా‌ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ విజయంతో కెప్టెన్ అజింక్య రహానే చరిత్రను తిరగరాశాడు. తాను సారథ్యం వహించిన ఏ టెస్టులోనూ భారత్ ఓడిపోలేదు.

గిల్‌ అదరహో:

గిల్‌ అదరహో:

నాలుగు పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. స్టార్ ఓపెనర్‌‌ రోహిత్‌ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ (91: 146 బంతుల్లో 8x4, 2x6)తో జతకట్టిన ఛెతేశ్వర పుజారా (56: 211 బంతుల్లో 7x4) ఇన్నింగ్స్‌‌ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్‌మెన్‌‌ గిల్‌ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇద్ద‌రూ క‌లిసి రెండో వికెట్‌కు 114 ప‌రుగులు జోడించారు. ఆ త‌ర్వాత రెండో సెష‌న్‌లో సెంచ‌రీకి కేవ‌లం 9 ప‌రుగుల దూరంలో గిల్ ఔట‌య్యాడు.

అడ్డుగోడలా పుజారా:

అడ్డుగోడలా పుజారా:

శుభమన్‌ గిల్‌ అనంతరం అజింక్య రహానే క్రీజులోకి వచ్చాడు. రహానే వచ్చిన తర్వాతి ఓవర్‌లో హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో పుజారా గాయపడ్డాడు. ఐతే అతనికి ఎలాంటి గాయం కాలేదు. దీంతో పుజారా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. రహానే వేగంగా ఆడాడు. మరోవైపు పూజారా కూడా వేగం పెంచాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో ర‌హానే (24) పెవిలియ‌న్ చేరాడు. దీంతో టీమిండియా 167 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్‌ పూర్తయ్యే సమయానికి భారత్‌ 183/3తో నిలిచింది. ఇక మూడో సెషన్‌లో భారత్ విజయానికి 144 పరుగులు చేయాల్సి ఉండడంతో మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందనుకున్నారు. పుజారా, పంత్‌ ఆ విధంగానే ఆడారు. వారిద్దరూ వికెట్‌ కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే జట్టు స్కోర్‌ 228 పరుగుల వద్ద పుజారా నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.

పంత్, సుందర్ అటాకింగ్:

పంత్, సుందర్ అటాకింగ్:

పుజారా అనంతరం మయాంక్‌ అగర్వాల్‌ (9) స్వల్ప స్కోరుకు పెవిలియన్‌ చేరాడు. అప్పటికి భారత్ స్కోర్ 265. దీంతో ఒక్కసారిగా మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. సిడ్నీ టెస్ట్‌లో 97 పరుగులు చేసి మ్యాచ్ డ్రా కావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన పంత్‌.. ఈసారి కూడా ఎదురుదాడికి దిగాడు. భారత్‌ విజయానికి 62 పరుగులు అవసరమైన వేళ వాషింగ్టన్‌ సుందర్ ‌(22; 29 బంతుల్లో 2x4,1x6) కూడా చెలరేగడంతో రహానే సేన విజయానికి చేరువైంది. అయితే సుందర్, శార్దూల్‌ ఠాకూర్‌ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అప్పటికే భారత్‌ గెలుపు ఖాయమైంది. 97వ ఓవర్‌ చివరి బంతికి బౌండరీ కొట్టిన పంత్..‌ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

గబ్బా మైదానంలో చరిత్ర:

ఇండియ‌న్ టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో మూడు వంద‌ల‌కుపైగా స్కోర్లు చేజ్ చేసి గెల‌వ‌డం ఇది కేవ‌లం మూడోసారి మాత్ర‌మే. అది కూడా ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై. అందులోనూ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎప్పుడూ గెల‌వ‌ని బ్రిస్బేన్‌లోని గ‌బ్బా స్టేడియంలో ఇంత భారీ స్కోరు ఛేదించ‌డం అనేది సాధార‌ణ విష‌యం కాదు. ఇక విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, శిఖర్ దావన్‌, జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్, ఇషాన్ శర్మ, మొహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్ల లేకుండానే పటిష్టమైన ఆసీస్‌ టీంపై విజయాన్ని సాధించి ఔరా అనిపించింది. 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని కంగారూ జట్టుకు టీమిండియా ఓటమి రుచి చూపించింది.

స్కోర్ వివరాలు:

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 369 ఆలౌట్‌

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 336 ఆలౌట్‌

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 294 ఆలౌట్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 329/7

Story first published: Tuesday, January 19, 2021, 14:08 [IST]
Other articles published on Jan 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+