ధోనీతో పోల్చడంపై ఘాటుగా పంత్
ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో పోల్చడంపై యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘాటుగా స్పందించాడు. ఇంగ్లాండ్తో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెస్టు సిరీస్తో 5 రోజుల ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన పంత్.. ఆ సిరీస్ ఆఖరి టెస్టులో సెంచరీ బాది వెలుగులోకి వచ్చాడు. దీంతో ఆ తర్వాత వెస్టిండీస్తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్లోనూ ఎంపికై వరసగా 92, 92 పరుగులతో సత్తాచాటాడు.
అంచనాల్ని అందుకుంటున్న పంత్..
అతని ఆట తీరును చూసిన సెలక్టర్లు.. వన్డే, టీ20ల్లోనూ చోటు కల్పించారు. వెస్టిండీస్తో గత వారం ముగిసిన టీ20 సిరీస్కి, నవంబరు 21 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్లోనూ ధోనీని తప్పించి మరీ భారత జట్టులో చోటిచ్చారు. అంచనాల్ని అందుకుంటున్న పంత్.. వెస్టిండీస్పై ఆఖరి టీ20 మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాది జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దీంతో.. ఇక జట్టులో ధోనీ స్థానాన్ని పంత్ భర్తీ చేసేశాడంటూ ప్రశంసలతో పాటు పోలికలు తెస్తున్నారు.
ధోనీతో పోలికలు తేవడంపై విసుగుచెంది
మహేంద్రసింగ్ ధోనీతో తనకి పోలికలు తేవడంపై విసుగుచెందిన పంత్ తాజాగా స్పందించాడు.‘ఎవరితోనో పోటీపడేందుకు నేను భారత జట్టులో లేను. ఇది నా కెరీర్లో నేర్చుకునే సమయం. అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని.. మహేంద్రసింగ్ ధోనీ నెలకొల్పిన ప్రమాణాల్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నా' అని ఘాటుగా బదులిచ్చాడు.
నవంబరు 21 నుంచి జనవరి 18వరకూ
పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై నవంబరు 21 నుంచి 3 టీ20ల సిరీస్ ఆడనున్న టీమిండియా.. ఆ తర్వాత డిసెంబరు 6 నుంచి నాలుగు టెస్టుల సిరీస్లో తలపడనుంది. చివరగా జనవరి 18న మూడో వన్డేను ఆడి వన్డే ఫార్మాట్ను ముగించుకుంటుంది.