|
నెట్స్లో శ్రమిస్తోన్న రిషబ్ పంత్
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్కు చేరుకున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మంగళవారం నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్ ప్రాక్టీస్లో భాగంగా రిషబ్ పంత్ ఆడిన ఓ షాట్ను బీసీసీఐ తన అధికారిక ట్వీటర్లో పోస్ట్ చేసింది. ఫాస్ట్ బౌలర్ వేసిన లెంగ్త్ బాల్ను బ్యాట్ తిప్పి మరీ వికెట్ల వెనుకకు ఆడాడు. ‘ఈ షాట్కు మీరు ఏ పేరు పెడతారు' అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది.
విపరీతంంగా ఆకట్టుకుంటోన్న షాట్
బౌలర్ వేసిన బంతిని పంత్ వికెట్ కీపర్ వెనుకాలకు తరలించిన షాట్ నెటిజన్లను విపరీతంంగా ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే ముందు పంత్ ఇండియా-ఎ జట్టు తరఫున రెండు వన్డే మ్యాచ్లు ఆడాడు. అందులో ఒక మ్యాచ్లో 73 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో ఇండియా-ఎ 6 వికెట్లతో గెలిచింది.
బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తొలి టీ20
బుధవారం జరగబోయే తొలి టీ20 మ్యాచ్ కోసం రిషబ్ పంత్తోపాటు దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, పాండ్యా, కుల్దీప్, ధోని, రోహిత్ శర్మ నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఆరంభం కానుంది.
|
న్యూజిలాండ్తో టీ20 సిరిస్కు భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, ధోని(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్ధ్ కౌల్, ఖలీల్ అహ్మద్, శుభమాన్ గిల్, విజయ్ శంకర్, హార్ధిక్ పాండ్యా