LSG vs SRH: అభిషేక్ శర్మ (20 బంతుల్లో 59), హెన్రిచ్ క్లాసెన్(28 బంతుల్లో 47), కమిందు మెండిస్(21 బంతుల్లో 32), ఇషాన్ కిషన్(28 బంతుల్లో 35) అద్భుతంగా రాణించడంతో సన్రైజర్స్ హైదరాబాద్ సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. 12 మ్యాచ్ల్లో లక్నోకు ఇది ఏడో ఓటమి. ఆ జట్టు 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. 12 మ్యాచ్ల్లో నాలుగో విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదో స్థానంలో ఉంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాచ్ ఓడిపోయిన అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కీలక ప్రకటన చేశాడు.
ఓటమి తర్వాత రిషబ్ పంత్ ఏమన్నాడంటే?
ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న తర్వాత రిషబ్ పంత్ ఓ వింత ప్రకటన చేశాడు. గాయాల కారణంగా తాము కొన్ని లోపాలను పూరించాల్సి ఉందని తెలుసని.. ఒక జట్టుగా దాని గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నామన్నాడు. మేము ప్లాన్ చేసిన విధంగానే బౌలింగ్ దాడి ఉంటే కథ వేరేలా ఉండేదన్నాడు. కొన్ని సార్లు విషయాలు నచ్చినట్లు జరుగుతాయి.. కొన్ని సార్లు జరగవని నిరాశను వ్యక్తం చేశాడు.

మా ఆట పట్ల గర్వంగా ఉంది: రిషబ్ పంత్
మా ఆట తీరు పట్ల మేము గర్వంగా ఉన్నామని.. సానుకూల అంశాలపై దృష్టి పెడతామని రిషబ్ పంత్ అన్నాడు. లక్నోకు బలమైన బ్యాటింగ్ లైనప్తో పాటు బౌలింగ్ లైనప్ కూడా ఉందన్నాడు. వారు అద్భుతంగా బౌలింగ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నాడు. మేము దానిని పూర్తిగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నామన్నాడు. మేము 10 పరుగులు తక్కువగా చేశామని మాకు తెలుసన్నాడు. మేము కొన్ని సందర్భాలలో బాగా ఆడాం కానీ మ్యాచ్ను పూర్తి చేయలేకపోయామన్నాడు. దిగ్వేష్ రతి బాగా రాణించాడని చెప్పుకొచ్చాడు. ఇది దిగ్వేష్ రతికి మొదటి సీజన్ అని.. అతను బౌలింగ్ చేసిన తీరు చూడటం బాగుందన్నాడు.
లక్నో దారుణ ఓటమి
ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించబడిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు లక్ష్యాన్ని చేరుకుంది. లక్ష్యాన్ని ఛేదించే జట్టు 200 కంటే ఎక్కువ పరుగులు చేసి గెలవడం ఈ మైదానంలో ఇదే తొలిసారి. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడూ ఒత్తిడికి గురికాకపోవడంతో అభిషేక్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్లో వరుసగా 4 సిక్సర్లు బాది 18 బంతుల్లోనే తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.