బర్మింగ్హామ్: ఎట్టకేలకు ప్రపంచకప్ టోర్నమెంట్లో తన తొలి మ్యాచ్ను ఆడేశాడు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఓపెనర్ రోహిత్ శర్మ, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్ను నిర్మించే ప్రయత్నాలు చేశాడు గానీ అవి సఫలం కాలేదు. బ్యాటింగ్కు దిగిన రిషబ్.. అతను ఎదుర్కొన్న తొలి ఓవర్లలో చాలా ఒత్తిడిలో కనిపించాడు.
తొలి మూడు బంతుల్లోనే రెండుసార్లు రనౌట్ నుంచి తప్పించుకోగలిగాడు. కాస్త కుదురుకున్నాక తనదైన శైలిలో బ్యాటింగ్ ఝుళిపించాడు. 29 బంతుల్లో నాలుగు ఫోర్లతో 32 పరుగులు చేశాడు. ప్లంకెట్ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద క్రిస్ వోక్స్ ఎడమ వైపు డైవ్ చూస్తూ అందుకున్న అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు.
అదలావుంటే- టీమిండియా బ్యాటింగ్ లైనప్లో కీలకమైన నాలుగో స్థానం.. మరోమారు వార్తల్లోకి ఎక్కింది. ఈ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రిషబ్ పంత్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. అనవసరపు షాట్లకు వెళ్లి, అవుట్ అయ్యాడు. మిడిలార్డర్ బ్యాటింగ్కు వెన్నుముకగా ఉండాల్సిన స్థానం అది. అలాంటి చోట బ్యాటింగ్కు వచ్చే వాళ్లు దూకుడుగా ఆడకూడదు అనేది ఓ క్రికెట్లో ప్రాథమిక సూత్రం. దానికి భిన్నంగా- రిషబ్ పంత్ రావడం, అవుట్ కావడం వెంటవెంటనే చోటు చేసుకున్నాయి.
Vice-captain @ImRo45 lightened up the post-match press conference when asked about Rishabh Pant 😁😁 #TeamIndia #ENGvIND #CWC19 pic.twitter.com/NSv3zVqFT3
— BCCI (@BCCI) June 30, 2019
ఇది కాస్తా చర్చనీయాంశమైంది. రిషబ్ పంత్ను నంబర్ ఫోర్ స్థానంలో ఆడించడంపై విలేకరుల నుంచి వచ్చిన ప్రశ్నలకు వైస్ కేప్టెన్ రోహిత్ శర్మకు ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు. అందుకే- తనదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేసి, ఆ ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమాధానాలను దాటవేశాడు. మ్యాచ్ ముగిసిన రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చాలా అంశాలపై ఆయన స్పందించాడు.
ఈ సందర్భంగా రిషబ్ పంత్ అంశాన్ని ప్రస్తావించాడో విలేకరి. దీనిపై కొన్ని ప్రశ్నలకు సంధించాడు. దీనికి సూటిగా సమాధానం ఇవ్వలేకపోయినప్పటికీ.. తెలివిగా బదులు ఇచ్చుకున్నాడు. రిషబ్ పంత్ ఏ స్థానంలో ఆడితే- అదే నంబర్ ఫోర్ అవుతుందని ఫన్నీగా కామెంట్స్ చేశాడు.
{headtohead_cricket_3_2}