న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డు బద్ధలు‌కొట్టిన రిషబ్ పంత్

ipl-feat-dd-vs-mi-match

హైదరాబాద్: ఢిల్లీ డేర్‌డేవిల్స్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక పరుగుల చేసిన వికెట్‌ కీపర్‌గా గుర్తింపు పొందాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వికెట్‌ కీపర్‌ రాబిన్‌ ఊతప్ప 660 (2014 సీజన్‌లో) పరుగుల ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగగా.. తాజాగా పంత్‌ అధిగమించాడు.

కేఎల్‌ రాహుల్‌ 652 (2018 సీజన్‌), జోస్‌ బట్లర్‌ 548(2018), దినేశ్‌ కార్తీక్‌ 510 (2013), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ 492 (2009)లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ సీజన్‌లోనే ముగ్గురు వికెట్‌ కీపర్‌లు( పంత్‌,రాహుల్‌, బట్లర్‌) అత్యధిక పరుగులు సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో పంత్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబై బౌలర్లను ధాటిగానే ఎదుర్కొంది. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ ఢిల్లీ తక్కువ స్కోరుకే తొలి వికెట్ కోల్పోయింది. వికెట్ల మధ్య పరుగు తీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓపెనర్ పృథ్వీ షా(12) రనౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు.

ఆరంభంలో చూపించిన దూకుడు క్రమంగా పెంచాల్సిన ఢిల్లీ అదే వేగాన్ని నడిపిస్తూ వచ్చింది. బ్యాటింగ్‌లో మెరుపులు సృష్టిద్దామనే ఉద్దేశ్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. ఒక దశలో వికెట్లు నిలబెట్టుకునేందుకు కష్టపడినా చక్కటి పరుగులను రాబట్టింది.

ఈ క్రమంలో 44 బంతుల్లో 64 పరుగులు చేసి స్కోరును పరుగులు పెట్టించాడు రిషబ్ పంత్. ఆ తర్వాత బరిలోకి దిగిన విజయ్ శంకర్ 30 బంతుల్లో 43 పరుగులతో ఆఖరి ఓవర్లలో జట్టుకు మంచి బలాన్ని చేకూర్చారు. దీంతో ఢిల్లీ 20ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 174పరుగులు చేసింది.

Story first published: Sunday, May 20, 2018, 20:24 [IST]
Other articles published on May 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X