Rinku Singh-Priya Saroj Wedding: ఉత్తరప్రదేశ్లోని మచ్లిషహర్ స్థానం నుంచి లోక్సభ సీటు గెలుచుకున్న ఎంపీ ప్రియా సరోజ్, భారత క్రికెటర్ రింకూ సింగ్ను వివాహం చేసుకోనున్నారు. వారిద్దరూ నవంబర్ 18న వివాహం చేసుకోబోతున్నారు. వారణాసిలోని హోటల్ తాజ్లో ఈ వివాహం జరగనుంది. ఈ వివాహానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సమావేశం కానున్నారు.
ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ జూన్ 8న లక్నోలో జరగనుంది. అక్కడ ప్రియా సరోజ్, రింకూ సింగ్ ఉంగరాలు మార్చుకోనున్నారు. వారి వివాహ వార్తల నేపథ్యంలో వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడంపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రియా సరోజ్, రింకూ సింగ్ నికర ఆస్తుల విలువ ఏమిటో తెలుసుకుందాం.

రింకు లేదా ప్రియా.. ఎవరు ధనవంతులు?
నిజానికి ప్రియా సరోజ్ యూపీలోని మచ్లిషహర్ స్థానం నుంచి లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఆమె మొదటిసారి 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచింది. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ సమాజ్వాదీ పార్టీకి కీలక నాయకుడు. ఈ స్థానం నుంచి మూడుసార్లు లోక్సభ ఎంపీ కూడా. ప్రియా సరోజ్ నికర ఆస్తుల గురించి మాట్లాడుకుంటే.. ఆమె మొత్తం ఆస్తులు రూ.11.25 లక్షలు. ఇందులో 10.18 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయబడింది. 32 వేల విలువైన బంగారం ఉంది.
మరోవైపు భారత క్రికెటర్ రింకూ సింగ్ ఆస్తుల గురించి మాట్లాడుకుంటే.. రింకూ సింగ్ మొత్తం నికర ఆస్తుల విలువ దాదాపు 8 నుంచి 9 కోట్లు. ఐపీఎల్ 2025లో కోల్కతా నైట్ రైడర్స్ రూ.13 కోట్లు చెల్లించి అతడిని నిలుపుకుంది. అంటే 2022 వేలంతో పోలిస్తే రింకూ సింగ్ జీతం దాదాపు 24 రెట్లు పెరిగింది. బీసీసీఐ రింకూ సింగ్కు ప్రతి సంవత్సరం దాదాపు 60 నుంచి 80 లక్షల రూపాయల జీతం ఇస్తుంది. రింకూ సింగ్ ఆస్తులు దాదాపు రూ.8 కోట్లుగా అంచనా వేయబడ్డాయి. ఈ క్రమంలో రింకూ సింగ్ కోబోయే భార్య ప్రియా సరోజ్ నికర ఆస్తుల విలువ రింకూ సింగ్ కంటే చాలా తక్కువ.