For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రింకూతో పాటు ఆ ఆరుగురికి ఉద్యోగాలు.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Govt Jobs: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రింకూ సింగ్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తెచ్చిన మరో ఆరుగురు క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఏ క్రీడాకారుడికి ఏ బాధ్యత అప్పగించారో ఇప్పుడు తెలుసుకుందాం.

7 మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు
భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ గురించి తెలియని వారుండరు. ఇటీవల రింకూసింగ్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగం లభించింది. అయితే ఈ గౌరవం పొందిన వారిలో రింకూ సింగ్ మాత్రమే కాకుండా మరో ఆరుగురు క్రీడాకారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలలో నియమించాలని నిర్ణయించింది. ఈ క్రీడాకారులందరూ అంతర్జాతీయ స్థాయిలో దేశం కోసం పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచారు. ఇప్పుడు వారి కృషికి గుర్తింపుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారికి ప్రభుత్వం సేవలో స్థానం కల్పిస్తోంది.

Rinku Singh and 6 Other Athletes Get Government Jobs Big Decision by UP Government

ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 మంది క్రీడాకారులను వారి కృషికి గుర్తింపుగా వివిధ విభాగాలలో నియమించాలని సిఫార్సు చేయబడింది. ఈ క్రీడాకారులందరి నియామకం ప్రత్యక్ష ఎంపిక ప్రక్రియ కింద జరిగింది, ఇది అంతర్జాతీయ పతక విజేత క్రీడాకారులకు మాత్రమే వర్తిస్తుంది.

క్రీడాకారులకు కేటాయించిన పదవులు

*రింకూ సింగ్ -భారత క్రికెటర్
పదవి: బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్
విభాగం: విద్యా విభాగం

*ప్రవీణ్ కుమార్ - పారా అథ్లెట్
పదవి: డిప్యూటీ ఎస్పీ (SP)
విభాగం: హోం విభాగం

*రాజ్‌కుమార్ పాల్ - హాకీ క్రీడాకారుడు
పదవి: డిప్యూటీ ఎస్పీ (SP)
విభాగం: హోం విభాగం

*అజిత్ సింగ్ - పారా అథ్లెట్
పదవి: జిల్లా పంచాయతీ రాజ్ అధికారి
విభాగం: పంచాయతీ రాజ్ విభాగం

*సిమ్రాన్ - పారా అథ్లెట్
పదవి: జిల్లా పంచాయతీ రాజ్ అధికారి
విభాగం: పంచాయతీ రాజ్ విభాగం

*ప్రీతి పాల్ - పారా అథ్లెట్
పదవి: బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
విభాగం: గ్రామీణాభివృద్ధి విభాగం

*కిరణ్ బాలియన్ - అథ్లెట్
పదవి: ప్రాంతీయ అటవీ అధికారి
విభాగం: అటవీ విభాగం

పదోన్నతి కోసం కొన్ని షరతులు
యూపీ సర్కారు క్రీడాకారులను నియమించినప్పటికీ సంబంధిత విభాగాల నిబంధనల ప్రకారం క్రీడాకారులు తదుపరి 7 సంవత్సరాలలోపు తమ విభాగానికి సంబంధించిన అన్ని అర్హతలను పూర్తి చేయాలి. తద్వారా వారికి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వారు అలా చేయలేకపోతే వారికి పదోన్నతి లభించదు. ప్రభుత్వం నియామక ప్రక్రియను ప్రారంభించింది. దీనిలో భాగంగా రింకూ సింగ్‌కు డాక్యుమెంట్ల కోసం ఒక లేఖ కూడా పంపబడింది.

Story first published: Thursday, June 26, 2025, 16:38 [IST]
Other articles published on Jun 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+