
ముంబైలో రహానే మీడియాతో
దీనిపై రహానే ముంబైలో మీడియాతో మాట్లాడాడు. 'జట్టు మేనేజ్మెంట్, సెలక్టర్ల ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తా. ఆటగాళ్ల మధ్య పోటీ మంచి ప్రదర్శనకు కారణమవుతోంది. జట్టులో ఎవరికి అవకాశం వచ్చినా బాగా ఆడుతున్నారు. ఈ పోటీని ప్రతిసారి ఆస్వాదిస్తాను' అని రహానే అన్నాడు.

వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్లో ఓపెనర్గా రాణించి వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. వెస్టిండీస్ పర్యటన నుంచి నా ఫామ్ను కొనసాగించడం సంతృప్తినిచ్చింది. నాపై ఉంచిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించా. వెస్టిండీస్ పర్యటన నుంచి నా ఫామ్ కొనసాగుతుంది' అని రహానే తెలిపాడు.

రోహిత్తో జట్టకు మంచి శుభారంభాన్ని అందించా
రోహిత్తో జట్టకు మంచి శుభారంభాన్ని అందించా. వచ్చే సిరీస్లలో నాకు అవకాశం లభిస్తే ఈ హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలుస్తా. ఇక జట్టు ప్రదర్శన గర్వించదగ్గ విషయం. మా లక్ష్యం ఒకటే 2019 వరల్డ్కప్. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం' అని రహానే అన్నాడు.

ధావన్తో ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తిక్లకు చోటు
టీ20 జట్టులో ధావన్తో పాటు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తిక్లకు చోటు దక్కింది. ఇదిలా ఉంటే రహానె సోమవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ముంబై రహదారులను శుభ్రం చేశాడు.


Click it and Unblock the Notifications











