వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్కు బుధవారం బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. 18 మందితో కూడిన రెండు వేర్వేరు జట్లను ఎంపికచేసింది. కొత్తగా ముగ్గురు ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. కెప్టెన్గా రోహిత్ శర్మ జట్టును నడిపించనుండగా.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యక్తిగత కారణాలతో తొలి వన్డే మ్యాచ్కు దూరం కానున్నాడు. అంతా బాగానే ఉన్నప్పటికీ ఇటు వన్డే, అటు టీ20 జట్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. అసలు అశ్విన్ను ఎందుకు ఎంపిక చేయలేదో సెలెక్టర్లు వివరించలేదు. అదే సమయంలో బుమ్రా, షమీకి విశ్రాంతి ఇచ్చినట్టు తెలిపారు. అలాగే గాయాలతో రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా అందుబాటులో ఉండడం లేదని సెలెక్టర్లు చెప్పారు. అశ్విన్ గురించి ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడంతో అతనిపై వేటు పడిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
టీ20 వరల్డ్కప్లో పరిమిత ఓవర్ల క్రికెట్లో అశ్విన్ రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో సత్తా కూడా చాటాడు. దీంతో టీమిండియాకు మూడు ఫార్మాట్లలో అశ్విన్ కీలక ఆటగాడిగా మారాడు. కానీ ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో అశ్విన్ రాణించలేకపోయాడు. అందుకే వెస్టిండీస్తో సిరీస్కు ఎంపిక చేయలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే నిజానికి అశ్విన్కు గాయమైనట్టు సమాచారం. సౌతాఫ్రికా పర్యటనలో రెండో వన్డే మ్యాచ్ ఆడుతుండగా ఈ సీనియర్ స్పిన్నర్ గాయపడ్డాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సఫారీలతో మూడో వన్డే మ్యాచ్కు కూడా దూరమైనట్టు సమాచారం. అశ్విన్ మణికట్టు, చీలమండకు తీవ్రంగా గాయమైందని తెలుస్తోంది. ఆ గాయం నుంచి అశ్విన్ ఇంకా కోలుకోలేదని సమాచారం. అందుకే విండీస్తో సిరీస్కు దూరమయ్యాడని తెలుస్తోంది. అయితే అశ్విన్ గాయం గురించి బీసీసీఐ నుంచి కానీ, టీం మెనేజ్మెంట్ నుంచి కానీ, అతని నుంచి ఎటువంటి సమాచారం లేదు. వీరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ అశ్విన్ ఎంపిక కాకపోవడం వెనుక ఉన్న అసలు కారణంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
వెస్టిండీస్తో సిరీస్కు భారత జట్టు:
వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హూడా, రిషబ్ పంత్, చాహర్, శార్దూల్ ఠూకూర్, చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్లన్ సుందర్, రవి బిష్ణోయ్, సిరాజ్, ప్రసిధ్, అవేశ్ఖాన్.
టీ20 జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేశ్అయ్యర్, చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, చాహల్, సుందర్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్, హర్షల్