IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ జట్టు ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ సాధించింది. తొలి సీజన్ నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీకి కూడా ఇది తొలి ఐపీఎల్ ట్రోఫీ. ఈ కారణంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. ఆర్సీబీ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా కూడా ఈ వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. అయితే ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ తొలగించింది.
ఆర్సీబీ విజయం తర్వాత సిద్ధార్థ్ మాల్యా మ్యాచ్ చివరి క్షణాలకు సంబంధించిన కొన్ని వీడియోలను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన టీవీ చూస్తున్నాడు. చివరి బంతి తర్వాత ఆర్సీబీ జట్టు గెలిచిన వెంటనే విజయ్ మాల్యా ఆనందంతో ఏడవడం ప్రారంభించారు. ఆయన కన్నీళ్లు ఆగడం లేదు. అయితే ఇన్స్టాగ్రామ్ ఆ వీడియోను తొలగించడమే కాకుండా.. సిద్ధార్థ్ మాల్యా ఖాతాపై కొన్ని రోజుల పాటు తన ఫాలోవర్లతో మాట్లాడకుండా నిషేధం విధించింది.

సిద్ధార్థ్ మాల్యా ఆగ్రహం
సిద్ధార్థ్ మాల్యా ఇన్స్టాగ్రామ్ ఖాతాపై నిషేధం తొలగిపోగానే.. ఆయన ఒక వీడియో షేర్ చేస్తూ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. "ఆర్సీబీ విజయం తర్వాత నేను ఒక భావోద్వేగ వీడియోను షేర్ చేశాను. చాలా మంది దానిని ఇష్టపడ్డారు. కానీ ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ తొలగించింది. నన్ను ఫాలోవర్లతో మాట్లాడకుండా నిషేధించింది. అందులో కాపీరైట్ విధానాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది. అయితే అందులో కేవలం బ్యాక్గ్రౌండ్లో మ్యాచ్ దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. ఇది పూర్తిగా అసంబద్ధం." అని సిద్ధార్థ్ మాల్యా అన్నారు.
బీసీసీఐ, ఐపీఎల్ ఈ చారిత్రక క్షణాన్ని తన నుంచి లాగేసుకున్నాయని సిద్ధార్థ్ మాల్యా ఆరోపించారు. సిద్ధార్థ్ తొలి సీజన్లలో ఆర్సీబీకి మద్దతుగా ప్రతి మ్యాచ్కీ స్టేడియానికి వచ్చేవారు. కానీ బ్యాంక్ కుంభకోణం ఆరోపణల తర్వాత విజయ్ మాల్యా తన కుటుంబంతో సహా భారతదేశం విడిచి పారిపోయారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు విజయ్ మాల్యా ఆర్సీబీ జట్టు యజమానిగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ జట్టు యజమాన్యంలో ఆయనకు ఎటువంటి వాటా లేదు. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తమ తొలి టైటిల్ను గెలుచుకుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించారు.