RCB vs PBKS: గురువారం ముల్లన్పూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. పంజాబ్ జట్టు 39 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ తప్ప టాప్ 5 బ్యాటర్లలో ఎవరూ రెండంకెల మార్కును చేరుకోలేకపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా త్వరగానే ఔట్ అయ్యాడు. జోష్ హేజిల్వుడ్ కేవలం 2 పరుగులకే అతడిని ఔట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఔట్ అయినప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో కూడా కొంత గందరగోళం నెలకొంది.
నిప్పులు చెరిగిన హేజిల్వుడ్
ఈ నెల ప్రారంభంలో సీజన్ తిరిగి ప్రారంభమైన తర్వాత జోష్ హేజిల్వుడ్ తొలిసారి ప్లేయింగ్ ఎలెవన్లోకి తిరిగి వచ్చాడు. పంజాబ్ కింగ్స్ టాపార్డర్ను ఆర్సీబీ కూల్చివేసింది. దీనిని చూసిన ప్రీతి జింటా కూడా నమ్మలేకపోయింది. హేజిల్వుడ్ ఆఫ్ స్టంప్ వెలుపల బౌలింగ్ చేశాడు. బంతి పిచ్పై బౌన్స్ అయింది. శ్రేయస్ అయ్యర్ పెద్ద షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి శ్రేయస్ అయ్యర్ బ్యాట్ అంచుకు తగిలి వికెట్ కీపర్ జితేష్ శర్మ చేతుల్లోకి వెళ్లింది. ఈ విధంగా టీ20లో హేజిల్వుడ్ శ్రేయస్ అయ్యర్ను నాలుగోసారి ఔటే చేశాడు. 5 ఇన్నింగ్స్లలో శ్రేయస్ అయ్యర్ హేజిల్వుడ్ వేసిన 20 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.

కోచ్ రికీ పాంటింగ్ వాగ్వాదం
శ్రేయస్ అయ్యర్ ఔట్పై వ్యాఖ్యానిస్తున్న భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ.. "ఇది అస్సలు మంచి షాట్ కాదు. ఇది పనికరాని షాట్." అంటూ కోపాన్ని వ్యక్తం చేశారు. పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ డ్రెస్సింగ్ రూమ్లో శ్రేయస్ అయ్యర్తో మాట్లాడుతూ కనిపించాడు. జట్టు ప్రదర్శన పట్ల రికీ పాంటింగ్ అసంతృప్తితో ఉన్నాడు.
పంజాబ్ పేలవ ప్రదర్శన
పంజాబ్ కింగ్స్ జట్టు హోమ్ గ్రౌండ్లో దారుణంగా విఫలమైంది. ఈ టోర్నమెంట్లో మెరుగైన బ్యాటింగ్ జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. వారు లీగ్ దశలో అగ్రస్థానంలో ఉన్నారు. సొంత మైదానం కావడంతో ఈ మ్యాచ్లో వారిని ఫేవరెట్గా పరిగణించారు. కానీ ఆర్సీబీ బాగా సిద్ధమైంది. ఏప్రిల్లో అదే మైదానంలో ఆర్సీబీ పంజాబ్ను ఓడించింది.