For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: ఆర్సీబీ విజయం.. కీలక పాత్ర పోషించిన 'ఆపరేషన్ సిందూర్'

IPL 2025: గత 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల కూడా ఇప్పుడు నెరవేరింది. పంజాబ్ కింగ్స్‌ను ఓడించడం ద్వారా ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. సీజన్ ప్రారంభం నుంచి ఆర్సీబీ ఈ సారి అద్భుతమైన స్థితిలో కనిపించింది. బ్యాటింగ్, బౌలింగ్ అయినా ఆర్సీబీ ఏ విభాగంలోనూ బలహీనంగా కనిపించలేదు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ జట్టు ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ కీలక ప్రకటన చేశాడు. "ఆపరేషన్ సిందూర్" ఆర్సీబీ విజయానికి ఎలా సహాయపడిందో చెప్పాడు.

ఆర్సీబీ ప్రధాన కోచ్ కీలక ప్రకటన
ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత జట్టు ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ ఇలా అన్నాడు. "ఆర్సీబీ విజయం సాధించడంలో ఆపరేషన్ సిందూర్ సాయపడింది. ఆ సమయంలో వచ్చిన విరామం హేజిల్‌వుడ్ కోలుకోవడానికి సమయం ఇచ్చింది. ముఖ్యంగా రజత్ పాటిదార్ చేతి గాయం నయం కావడానికి సమయం ఇచ్చిందని కొందరు నాకు చెప్పారు. ఇది ఖచ్చితంగా మాకు కొంత ఉపశమనం కలిగించింది. ఎందుకంటే అంతకు ముందు మేము కొంచెం నెమ్మదిగా ఆడాం." అని ఆర్సీబీ ప్రధాన కోచ్ పేర్కొన్నారు. భారత్ -పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య ఐపీఎల్ 10 రోజులు నిలిపివేయబడింది. దీని కారణంగా గాయం నుంచి కోలుకోవడంలో జోష్ హేజిల్‌వుడ్ చాలా సహాయం పొందాడు. ఐపీఎల్ నిలిపివేయబడిన తర్వాత హేజిల్‌వుడ్ ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత హేజిల్‌వుడ్ లీగ్‌లోని చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు.

RCB s Historic IPL 2025 Win Role of Operation Sindoor Revealed by Head Coach Andy Flower

హేజిల్‌వుడ్‌కు గొప్పగా ఉన్న ఐపీఎల్ 2025
ఐపీఎల్ 2025లో జోష్ హేజిల్‌వుడ్‌ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ సీజ‌న్‌లో హేజిల్‌వుడ్ 12 మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేస్తూ 22 వికెట్లు పడగొట్టాడు. అయితే చివరి మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ కాస్త ఎక్కువగానే పరుగులు సమర్పించుకున్నాడు. ఎందుకంటే చివరి ఓవర్లో శశాంక్ సింగ్ అతడి బౌలింగ్‌లో ఎక్కువగా పరుగులు రాబట్టాడు. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్ చేస్తూ 4 ఓవర్లలో 54 పరుగులకు ఒక వికెట్ తీసుకున్నాడు.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ తరఫున బౌలింగ్ చేస్తున్నప్పుడు కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులకు 2 కీలక వికెట్లను పడగొట్టాడు. ఈ కారణంగా కృనాల్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Story first published: Wednesday, June 4, 2025, 15:35 [IST]
Other articles published on Jun 4, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+