For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: ద గ్రేట్ 'ఆర్సీబీ'.. ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు

IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్‌లో లీగ్ దశ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు 4 వికెట్లు కోల్పోయి 228 పరుగుల లక్ష్యాన్ని చేరుకోగా.. క్వాలిఫయర్-1కి కూడా అర్హత సాధించింది. ఆర్సీబీ ఈ విజయం 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఇంతకు ముందు ఏ జట్టు కూడా సాధించలేని ఘనతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సాధించింది. ఆర్సీబీ 14 మ్యాచ్‌లలో 9 విజయాలు, 4 ఓటమలతో లీగ్ దశను ముగించింది. ఈ క్రమంలో ఆర్సీబీ మొత్తం 19 పాయింట్లను సాధించింది.

చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ క్వాలిఫయర్-1కు దూసుకెళ్లింది. దీంతో పాటు ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ సొంత మైదానంలో కంటే ప్రత్యర్థి జట్లకు చెందిన మైదానాల్లోనే మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో లీగ్ దశలో ప్రత్యర్థి జట్లతో వాటి హోంగ్రౌండ్స్‌లో జరిగిన మ్యాచ్‌లన్నింటినీ గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. ఆర్సీబీ ఈ సీజన్‌లో సొంత మైదానం కాకుండా ప్రత్యర్థి జట్ల మైదానాల్లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది. ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్స్ లో ఢిఫెండింద్ ఛాంపియన్స్ కేకేఆర్ ను ఓడించిన ఆర్సీబీ.. ఆ తర్వాత సీఎస్కే, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లను వారి సొంత మైదానాల్లోనే మట్టికరిపించింది.

RCB Creates History in IPL 2025 First Team to Win All Away Matches in League Stage

క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ తో తలపడనున్న ఆర్సీబీ
9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్‌కు టాప్-2 స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ మే 29న చంఢీగఢ్ లోని పీసీఏ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు ఫైనల్ కు చేరుకోవడానికి మరో అవకాశం లభిస్తుంది. మొదటి క్వాలిఫయర్ లో ఓడిన జట్టు తర్వాత ఎలిమినేటర్ విజేతతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు నేరుగా ఫైనల్ మ్యాచ్‌కు చేరుకుంటారు. ఆర్సీబీ ఈసారి 18 ఏళ్ల కరువును అంతం చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఆర్సీబీ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం వారి అభిమానులకు గర్వకారణం మాత్రమే కాదు.. మొత్తం ఐపీఎల్ చరిత్రలో ఒక మైలురాయి కూడా.

Story first published: Wednesday, May 28, 2025, 9:59 [IST]
Other articles published on May 28, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+