For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB: నన్ను గాయపరిచారు.. ఇక భారత ఆటగాళ్లతో ఏ ఆటలు ఆడను: నాగ్స్‌

RCB Captain Virat Kohli trolls Mr Nags, He was not talking to Indian Players

దుబాయ్: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు (ఆర్సీబీ) జట్టు ఫన్నీ మ్యాన్‌ 'మిస్టర్‌ నాగ్స్‌' సందడి మొదలైంది. తన ఇంగ్లిష్‌ మాటలతో, ప్రత్యేకమైన హాస్యంతో ఆర్సీబీ జట్టు సభ్యులను, అభిమానులను ఉత్సాహపరిచే నాగ్స్‌.. బెంగుళూరు జట్టులోని భారత ఆటగాళ్లపై అసంతృప్తితో ఉన్నాడు. ఇక భారత ఆటగాళ్లతో ఏ ఆటలు ఆడబోడనని, ఇకపై విదేశీ ఆటగాళ్లతోనే మాట్లాడతానని పేర్కొన్నాడు. ఇదంతా మిస్టర్‌ నాగ్స్‌ ఒక వీడియోలో చెప్పాడు. విషయంలోకి వెళితే....

వాలీబాల్‌ ప్రాక్టీస్:

వాలీబాల్‌ ప్రాక్టీస్:

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని జట్లు బీసీసీఐ రూల్స్ ప్రకారం క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో గతవారం ఆర్సీబీ జట్టు సభ్యులు అందరూ కలిసి వాలీబాల్‌ ఆడారు. మ్యాచ్ జరుగుతుండగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బంతిని మిస్టర్‌ నాగ్స్‌పైకి తన్నాడు. దాంతో నాగ్స్‌ అలిగాడు.

విదేశీ ఆటగాళ్లతోనే ఉంటా:

విదేశీ ఆటగాళ్లతోనే ఉంటా:

విరాట్‌ కోహ్లీ బంతిని తనపైకి తన్నాడని మిస్టర్‌ నాగ్స్ ఆర్సీబీ విడుదల చేసిన వీడియో చెప్పాడు. తనకు గాయాలయ్యాయని.. మళ్లీ వాళ్లతో కలిసి ఏ ఆటలు ఆడబోడనని స్పష్టం చేశాడు. ఇకపై విదేశీ ఆటగాళ్లతోనే ఉంటానని, వాళ్లతోనే మాట్లాడతానని నాగ్స్ పేర్కొన్నాడు. చెప్పిన విధంగానే భారత ఆటగాళ్లు పలకరించినా మాట్లాడలేదు. యుజ్వేంద్ర చహల్, పార్థివ్ పటేల్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, పవన్ నెగిలు పలకరించినా.. నాగ్స్ పట్టించుకోలేదు.

కోహ్లీ పక్కన నిలబడినా:

కోహ్లీ పక్కన నిలబడినా:

విదేశీయుడిలా వేశధారణ మార్చుకొని కోచ్‌ సైమన్‌ కటిచ్‌, డేల్‌ స్టెయిన్‌, ఏబీ డివిలియర్స్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా 'విరాట్‌ నా పట్ల ఏం చేశాడో నువ్వు చూశావు' అని డివిలియర్స్‌తో అనగా.. 'నిజమే నాగ్స్.. దారుణంగా ప్రవర్తించాడు' అని బదులిచ్చాడు. అనంతరం నాగ్స్‌.. కోహ్లీ పక్కన నిలబడినా ‌పట్టించుకోలేదు. చివరికి అతడి వేషధారణ, జుట్టు రంగు బాగోలేదని కోహ్లీ జోక్‌ చేశాడు. అక్కడితో వీడియో ముగిసిపోయింది. అయితే ఇదంతా ఆ జట్టులో నాగ్స్‌ చేసే సందడి మాత్రమే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

బెంగుళూరు విమానాశ్రయం నుంచే మొదలు:

ఐపీఎల్ 2020 కోసం బెంగుళూరు విమానాశ్రయం నుంచి ఆర్సీబీ బయలుదేరినప్పటి నుంచే మిస్టర్ నాగ్స్‌ సందడి మొదలైంది. అప్పుడే ఆటగాళ్లతో ప్రాంక్స్‌ చేశాడు. ఆటగాళ్లకు కరోనా పరీక్షలు ఎలా చేశారో సరదాగా వీడియోలో చూపించాడు. అలాగే జట్టుతో కలిసి విరాట్ కోహ్లీ ఎందుకు రాలేడని ఆటగాళ్లు అడిగిన ప్రశ్నకి.. అతడికి భారీ మొత్తంలో చెల్లిస్తున్నామని, ప్రత్యేకంగా వస్తాడని సరదాగా బదులిచ్చాడు.

Story first published: Saturday, September 5, 2020, 16:36 [IST]
Other articles published on Sep 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+