ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఆసీస్ - భారత్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచి ఫైనలిస్ట్ కు చేరుకోవాలని భారత క్రికెట్ అభిమానులంతా బలంగా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఆస్ట్రేలియాపై భారత్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
కచ్చితంగా గెలుస్తాం..
"కచ్చితంగా ఈ సెమీఫైనల్ మ్యాచ్ గెలవబోతున్నాం. భారత్ - పాక్ మ్యాచ్ తర్వాత క్రికెట్ లో ఆసక్తికరమైన పోరు భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఉంటుంది. గత కొన్నేళ్లుగా భారత్ - ఆసీస్ మధ్య పోరు ఎంత థ్రిల్లింగ్ గా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం. అయినా నేనొక్కదాన్నే కాదు, భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈ సెమీఫైనల్ ను అధిగమిస్తాం అనే ధీమాతోనే ఉన్నారు. నా తరఫున, ఈ ప్రపంచంలోని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ తరఫున టీమిండియాకు ఆల్ ది బెస్ట్." అని రివాబా జడేజా చెప్పుకొచ్చింది.

Ravindra Jadeja's wife on India vs Australia Semifinal Match and wishing Team India for the Victory. 🇮🇳 (ANI).pic.twitter.com/EnHcXgfmCu
— Tanuj Singh (@ImTanujSingh) March 4, 2025
అదే ఫార్ములాతో బరిలోకి దిగాలని..
ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. అయితే దుబాయ్ పిచ్ స్పిన్కు సహకరిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్కు అప్లై చేసిన ఫార్మూలానే ఈ సెమీస్ మ్యాచ్ కు ఉపయోగించాలని మాజీలు సూచిస్తున్నారు. కివీస్ మ్యాచ్ లో నలుగురు స్పిన్నర్లతో ఆడి ఘన విజయం సాధించింది భారత్. అందుకే ఇప్పుడు ఆసీస్ మ్యాచ్ లోనూ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని అంటున్నారు.