టెస్టుల్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఒకే ఏడాదిలో నంబర్ 7వ స్థానంలో బ్యాటింగ్ దిగి రెండు సెంచరీలు చేసిన బ్యాటర్ల లిస్టులో చేరాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్గా జడ్డూ నిలిచాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఎడ్జ్బస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్డ్ ఐదో టెస్టులో జడేజా ఈ ఘనత సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 83 పరుగులతో నాటౌట్గా ఉన్న రవీంద్ర జడేజా రెండో రోజు తొలి గంటలోనే సెంచరీ కొట్టాడు.
టెస్ట్ మ్యాచ్లల్లో అతనికి ఇది మూడో సెంచరీ. ఈ ఏడాదిలో అతను చేసిన రెండో సెంచరీ. మాథ్యూ పాట్ వేసిన 79వ ఓవర్ చివరి రెండు బంతులను బౌండరీలకు తరలించి మరీ.. రవీంద్ర జడేజా వంద పరుగుల ల్యాండ్ మార్క్ను అందుకున్నాడు. తనదైన స్టైల్లో బ్యాట్ను కత్తిలా తిప్పుతూ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక తన ఇన్నింగ్స్ 104పరుగుల వద్ద ముగిసింది. ఇక ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ (146), కెప్టెన్ బుమ్రా (16బంతుల్లో 31) రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 416పరుగులు చేయగలిగింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5వికెట్ల హాల్ సాధించగా.. మాథ్యూ పాట్స్ 2 వికెట్లు, బ్రాడ్, రూట్, స్టోక్స్ తలా ఓ వికెట్ సాధించారు. ఇక ఒకే క్యాలెండర్ ఈయర్లో రెండు సెంచరీలు సాధించిన నాలుగో నంబర్ ఇండియన్ బ్యాటర్ల లిస్టులో 1.1986లో కపిల్ దేవ్, 2. 2009లో ఎంస్ ధోని, 3. 2010లో హర్భజన్ సింగ్, 4. 2022లో రవీంద్రా జడేజా ఉన్నారు.