హైదరాబాద్: ఐపీఎల్లో క్రికెట్ మ్యాచ్లు ఆడుతుండటంతో తమకు దేశంలో ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ విజ్ఞప్తి చేశాడు. మార్చి 23న ఐపీఎల్ 2109 సీజన్ ప్రారంభం కావడంతో క్రికెటర్లంతా ఈ క్యాష్ రిచ్ టోర్నీలో బిజీ బిజీగా ఉన్నారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆడే ఆటగాళ్లు భారత్లోని అనేక నగరాల్లో మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. తాజా ఐపీఎల్ సీజన్లో మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. భారతదేశం అంతటా వివిధ రాష్ట్రాల్లో మొత్తం ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తన సొంత ఊరిలోనే ఓటు వేయాలి. అయితే, ఎన్నికలు జరిగే సమయంలో ఆ క్రికెటర్ తన రాష్ట్రంలో ఉండకపోవచ్చు. దీంతో తాము ఓటు వేసే అవకాశం కోల్పోతామని కింగ్స్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్... ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొచ్చాడు.
దీంతో తమకు దేశంలో ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్టర్లో విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని తమకు నచ్చిన నేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చాడు. అదే సమయంలో తమకు ఈ వెసులుబాటు కల్పించాల్సిందిగా ప్రధానిని కోరాడు.
Always thought voting is the fulcrum of our democracy and I definitely would like to urge the entire country, each and everyone of you from every nook and corner of our country to vote and choose their rightful leader. https://t.co/GXmsKh2TTh
— Ashwin Ravichandran (@ashwinravi99) March 25, 2019
I would also like to request you @narendramodi sir to enable every cricketer playing in the IPL to be allowed to cast their votes from which ever place they find themselves at. 🙏
— Ashwin Ravichandran (@ashwinravi99) March 25, 2019