For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుడ్డోడి క్రేజ్ మామూలుగా లేదు.. అశ్విన్-పుజారా మధ్య సోషల్ మీడియా వార్!

క్రికెట్ స్టేడియంలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ అలరిస్తుంటాడు. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 15 ఏళ్ల వయసులో జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్‌ను ఎదుర్కొని సిక్సర్లు బాదిన వైభవ్ సూర్యవంశీకి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సెల్యూట్ చేయగా.. దీనిపై రవిచంద్రన్ అశ్విన్ తన సహచర ఆటగాడు ఛతేశ్వర్ పుజారాను ఆటపట్టించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

హర్భజన్ సెల్యూట్.. నవ్విన పుజారా!
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు ఫిదా అయిన హర్భజన్ సింగ్.. కామెంట్రీ బాక్సులో లేచి నిలబడి ఆ కుర్రాడికి సెల్యూట్ చేశాడు. "15 ఏళ్ల వయసులో ఇలాంటి డామినేషన్ చూపించడం మామూలు విషయం కాదు.. వైభవ్, జైస్వాల్ మీ ఇద్దరికీ నా సెల్యూట్" అని హర్భజన్ సింగ్ కొనియాడాడు. అయితే అదే సమయంలో హర్భజన్ సింగ్ పక్కనే కూర్చున్న ఛతేశ్వర్ పుజారా మాత్రం సెల్యూట్ చేయకుండా కేవలం మొహమాటంగా నవ్వుతూ కనిపించాడు.

Ravichandran Ashwin Hilariously Trolls Pujara Over Vaibhav Suryavanshi Salute Post RR vs MI Clash

రవిచంద్రన్ అశ్విన్ పంచ్ డైలాగ్
ఈ వీడియోపై స్పందించిన రవిచంద్రన్ అశ్విన్.. ఎక్స్ వేదికగా ఛతేశ్వర్ పుజారాను ట్రోల్ చేశాడు. "నా తరఫున కూడా వైభవ్ సూర్యవంశీకి ఓ సెల్యూట్.. కానీ నా ప్రియమిత్రుడు పుజారా మాత్రం సరిగ్గా సెల్యూట్ చేయలేదు" అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. టెస్టుల్లో అత్యంత సంప్రదాయబద్ధంగా ఆడే ఛతేశ్వర్ పుజారా.. ఈ ఫాస్ట్ క్రికెట్ ఎమోషన్స్‌ను పట్టుకోవడంలో కాస్త తడబడటాన్ని రవిచంద్రన్ అశ్విన్ ఇలా సరదాగా నెటిజన్ల ముందుకు తెచ్చాడు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.

రికార్డుల వేటలో రాజస్థాన్ ఓపెనర్లు
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ జోడి ముంబై బౌలర్లను ఉతికారేశారు. వీరిద్దరూ కలిసి 2.4 ఓవర్లలోనే జట్టు స్కోరును 50 పరుగుల మార్కుకు చేర్చారు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఉమ్మడి రెండో ఫాస్టెస్ట్ జట్టు అర్థశతకం కావడం విశేషం. యశస్వి జైస్వాల్ 32 బంతుల్లో 77 పరుగులు చేయగా.. వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరి విధ్వంసంతో రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లలోనే 150 పరుగుల భారీ స్కోరును సాధించి.. ముంబైపై ఘనవిజయం సాధించింది. చివరగా, వైభవ్ సూర్యవంశీ ఆటతీరు మైదానంలోని ఆటగాళ్లనే కాకుండా.. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న దిగ్గజాలను కూడా తన వైపు తిప్పుకునేలా చేస్తోంది.

Story first published: Wednesday, April 8, 2026, 14:12 [IST]
Other articles published on Apr 8, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+