వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడేలా
ఆ అనుభవంతో ఆసీస్తో టెస్టు సిరీస్కు ముందు వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడేలా చూడాలని బీసీసీఐని రవిశాస్త్రి కోరనున్నాడట. ఆతిథ్య ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్కు ముందు భారత్ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా దాన్ని ఒక రోజు తగ్గించి మూడు రోజుల పాటు మాత్రమే ఆడింది. అలాగే ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్కు ముందు ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు.
ప్రాక్టీసు మ్యాచ్ విషయంలో అలసత్వం దేనికి:
ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడితేనే టెస్టుల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అలాంటిది ప్రాక్టీస్ మ్యాచ్లు విషయంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని బీసీసీఐ ప్రశ్నించింది. దీంతో రవిశాస్త్రి ఈ ఏడాది నవంబరులో ఆసీస్ పర్యటనకు వెళ్లిన సమయంలో వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడేలా ముందే ప్లాన్ చేసుకుంటామని తెలిపాడు. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం భారత్ చేరుకున్న రవిశాస్త్రి మీడియాతో మాట్లాడాడు.
ప్రాక్టీస్ మ్యాచ్లు బిజీ షెడ్యూల్ వల్లే :
‘బిజీ షెడ్యూల్ కారణంగానే ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడలేకపోతున్నాం. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనలను పరిగణనలోకి తీసుకుంటే టీ20, వన్డే సిరీస్ల తర్వాత కొద్ది రోజుల విరామంలోనే టెస్టు సిరీస్లు ప్రారంభమయ్యాయి. ఆ కొద్ది రోజుల్లోనే ఎన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాలి?. ఈ ఏడాది నవంబరులో టీమిండియా ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. ఆ పర్యటనలో ఆసీస్తో టెస్టు సిరీస్కు ముందు వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడతాం. ఇదే విషయాన్ని బీసీసీఐని కోరతాను' అని శాస్త్రి తెలిపాడు.
ఆస్ట్రేలియా పర్యటన తేదీలు:
ఈ ఏడాది నవంబరు 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆసీస్తో భారత్ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. మొదట టీ20లు అనంతరం ఇరు జట్ల మధ్య డిసెంబరు 6 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ పర్యటన కంటే ముందు భారత్ ఆసియా కప్ లో తలపడనుంది. సెప్టెంబరు 15 నుంచి మొదలు కానున్న ఈ టోర్నీలో భారత్ సెప్టెంబరు 18న తొలి మ్యాచ్ ఆడుతుంది.