
హైదరాబాద్: 'అభిమానుల కామెంట్లా అవి పిచ్చ లైట్. అన్నింటినీ పట్టించుకునేంత తీరిక మాకు లేదు.' నిర్విరామంగా వెనువెంటనే సిరీస్లను ఆడుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అయిన రవిశాస్త్రి ఈ విధంగా చెప్పుకొచ్చాడు.
పొట్టి క్రికెట్ అయిన టీ 20 కేవలం యువకులను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. కొత్త ఆటగాళ్లలోని ప్రతిభను అందరికీ తెలిసేందుకు ఏర్పాటు చేయడమే ఈ పొట్టి క్రికెట్ ప్రధాన ఉద్దేశ్యమంటూ రవి శాస్థ్రి తన మనోభావాన్ని వ్యక్తం చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తన ప్రస్తుత జట్టు టీ20 గెలుపోటములను లెక్కచేయదని తెలిపాడు. ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా అంతర్జాతీయ క్రికెట్ జట్టు టెస్ట్, వన్డే మ్యాచ్లపై ఎలాంటి ప్రభావముండదన్నాడు. ఈ విధంగా తన నుంచి వచ్చిన స్పందనకు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనికి మళ్లీ స్పందించిన రవిశాస్త్రి ఈ కామెంట్లు పిచ్చ లైట్ అనే రీతిలో భావిస్తున్నాడు.
ఇదిగో నెటిజన్ల ట్వీట్ కామెంట్లు..
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.