
అప్లై చేస్తా కానీ.. క్యూలో నిలబడను
అప్లై చేస్తా కానీ.. నాకు కోచ్ పదవి కావాలని అందరిలాగా క్యూలో నిలబడను.. కచ్చితంగా నాకే ఆ పదవి ఇస్తా అంటేనే చేస్తానని తేల్చి చెప్పినట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు బీసీసీఐ ముందు తన కండిషన్స్ కూడా ఉంచాడు. రవిశాస్త్రికి కెప్టెన్ కోహ్లీ మద్దతు ఉండటంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని క్రికెట్ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి గతేడాది కుంబ్లేతోపాటు రవిశాస్త్రి కూడా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోచ్ ఎంపిక ప్రక్రియను బీసీసీఐ సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీకి బీసీసీఐ అప్పగించింది.

రవిశాస్త్రి Vs గంగూలీ
ఈ కమిటీలో ఉన్న గంగూలీకి మాత్రం రవిశాస్త్రికి కోచ్ పదవి ఇవ్వడం ఇష్టం లేదు. దీంతో రవిశాస్త్రిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలోనూ గంగూలీ ప్యానెల్లో లేడు. ఆ తర్వాత క్రికెట్ సలహా కమిటీ కుంబ్లేని కోచ్గా ఎంపిక చేసింది. ఈ విషయమై రవిశాస్త్రి, గంగూలీ మధ్య అప్పట్లో మాటల యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో రవిశాస్త్రి కాస్తంత బెట్టుగా వ్వవహారిస్తున్నాడని అంటున్నారు.

కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి 7-10 రోజులు
కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 7-10 రోజులు అవకాశం ఇచ్చింది. సరైన అర్హత, అనుభవంతో పాటు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది. గత నెలలో దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు రేసులో కుంబ్లే ఉండటంతో ఎక్కువ దరఖాస్తులు రాలేదు. ప్రస్తుతం కుంబ్లే వైదొలగడంతో చాలా మంది ఆసక్తి చూపే అవకాశం ఉంది.

కుంబ్లే తప్పుకోవడంతో తెరపైకి రవిశాస్త్రి పేరు
కోచ్ పదవి నుంచి కుంబ్లే తప్పుకోవడంతో తాజాగా తెరపైకి రవిశాస్త్రి పేరు వచ్చింది. అయితే రవిశాస్త్రికి కచ్చితంగా ఇస్తామని బోర్డు హామీ ఇచ్చిందో లేదో తెలియదు గానీ జులై చివర్లో మొదలయ్యే శ్రీలంక పర్యటన లోపు కొత్త కోచ్ ఎంపికను మాత్రం పూర్తి చేస్తామని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టంచేశారు. కొత్త కోచ్ 2019 వరల్డ్కప్ వరకు ఉంటాడని కూడా ఆయన చెప్పారు. కాగా, బీసీసీఐ మే 31లోపు దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్చంద్ రాజ్పుత్, రిచర్ పైబస్, దొడ్డ గణేశ్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











