
కుంబ్లే రాజీనామాతో మళ్లీ దరఖాస్తుల ఆహ్వానం
కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కోచ్ ఎంపిక ప్రక్రియ కోసం గడువుని సైతం పెంచింది. జులై 9 వరకు కోచ్ పదవికి అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఓ ప్రకటన విడుదల చేశారు.

జులై 9 చివరి తేదీ
పురుషుల ప్రధాన కోచ్ పదవికి ఆహ్వానించిన దరఖాస్తుల గడువు తేదీని పెంచుతున్నామని అందులో పేర్కొన్నారు. అంతకముందు కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. మే 31 నాటికి గడువు ముగిసే సమయానికి కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్, సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్మూడీ, రిచర్డ్ పైబస్, లాల్చంద్ రాజ్పుత్, దొడ్డా గణేష్లు దరఖాస్తు చేసుకున్నారు.

త్వరలో ఇంటర్యూలు
గంగూలీ, సచిన్, లక్ష్మణ్తో కూడిన క్రికెట్ సలహా కమిటీ వీరిన త్వరలోనే ఇంటర్యూ చేయనున్నారు. కుంబ్లే రాజీనామాతో ప్రధాన కోచ్ పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు గంగూలీ, లక్ష్మణ్, సచిన్తో కూడిన క్రికెట్ సలహా కమిటీ ముందు మరిన్ని అప్లికేషన్స్ ఉంచాలనే ఉద్దేశంతో బీసీసీఐ దరఖాస్తులను మళ్లీ ఆహ్వానించింది.

కండిషన్ పెట్టిన రవిశాస్త్రి
ఈ నేపథ్యంలో రవిశాస్త్రిని కూడా కోచ్ పదవి కోసం అప్లై చేసుకోమని బీసీసీఐ అంతకముందు కోరినట్లు వార్తలు వచ్చాయి. అప్లై చేస్తా కానీ.. నాకు కోచ్ పదవి కావాలని అందరిలాగా క్యూలో నిలబడను.. కచ్చితంగా నాకే ఆ పదవి ఇస్తానంటేనే అప్లే చేస్తానంటూ కండిషన్ పెట్టిన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.


Click it and Unblock the Notifications











