
హైదరాబాద్: టీమిండియా మాజీ ఆటగాడు విక్రమ్ రాఠోడ్ను భారత్-ఎ, అండర్-19 జట్లకు బ్యాటింగ్ కోచ్గా చేసిన నియమాకాన్ని బీసీసీఐ నిలిపి చేసింది. అండర్-19 జట్టు సెలక్టర్ ఆశిష్ కపూర్కు తాను బంధువునని క్రికెట్ పాలకుల కమిటీకి రాఠోడ్ లిఖిత పూర్వకంగా ఇవ్వడంతో విరుద్ధ ప్రయోజనాల దృష్ట్యా అతడి నియమాకాన్ని నిలిపివేసింది.
"అతడికి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వలేదు. భారత్-ఎ, అండర్-19 జట్లకు బ్యాటింగ్ కోచ్గా రాఠోడ్ ఉండాలని ద్రవిడ్ కోరుకున్నాడు. అయితే రాఠోడ్కు విరుద్ధ ప్రయోజనాలు వర్తిస్తాయనే విషయాన్ని బీసీసీఐ క్రికెట్ వ్యవహారాల జీఎం సబా కరీం సీఓఏకు తెలియజేయలేదు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.