మాంఛెస్టర్: భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య చారిత్రాత్మక మ్యాచ్కు వేదికైన మాంఛెస్టర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఓ అనుకోని అతిథి సందడి చేశాడు. కామెంటర్ అవతారం ఎత్తాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి గ్రౌండ్లో సందడి చేశాడు. అతనే- బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్. క్రికెట్పై రణ్వీర్ సింగ్కు పెద్దగా అవగాహన లేదు. అయినప్పటికీ.. అదే పనిగా మాంఛెస్టర్కు వెళ్లాడు. టీమ్కు శుభాకాంక్షలు తెలిపాడు. వారితో కలిసి కొద్దిసేపు సరదాగా గడిపాడు.
దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ బాలీవుడ్లో రూపుదిద్దుకోబోతున్న ఓ ప్రతిష్ఠాత్మక మూవీకి సైన్ చేశాడు. అదే కపిల్ దేవ్ బయోపిక్. బయోపిక్ అనగానే.. కపిల్ దేవ్ బాల్యం నుంచీ చూపిస్తారనుకుంటే పొరపాటే. 1983 నాటి ప్రపంచకప్ ఘట్టాలను మాత్రమే తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకొంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్పైకి వెళ్లబోతోంది. ఈ మూవీలో కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నాడు రణ్వీర్ సింగ్.
ఈ పాత్ర కోసం క్రికెటర్ల హావభావాలను దగ్గరి నుంచి పరిశీలించడానికి రణ్వీర్ సింగ్ మాంఛెస్టర్కు వెళ్లినట్లు చెబుతున్నారు. అక్కడికి వెళ్లిన తరువాత స్టార్ స్పోర్ట్స్ ఛానల్ మైక్ పట్టుకుని కాస్సేపు సరదాగా గడిపాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బోయ్స్ అంబడ్ గాళ్స్, చిల్డ్రన్స్ అండ్ ఆల్ ఏజెస్ అంటూ కామెంటేటర్ అవతారం ఎత్తాడు. వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి సెల్ఫీ దిగాడు. మాంఛెస్టర్ వాతావరణం అద్భుతంగా ఉందని, ఫుల్ ఎనర్జిటిక్గా ఉందని, మన క్రికెట్ టీమ్ అంత కంటే ఎనర్జీని కలిగి ఉందంటూ కామెంట్స్ చేశాడు.
{headtohead_cricket_3_5}