భారత క్రికెట్ లో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ క్లోజ్ ఫ్రెండ్, ముంబయి మాజీ కెప్టెన్ మిలింద్ రేగే (76) కన్నుమూశారు. గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ..
మిలింద్, తన క్రికెట్ కెరీర్ లో ఆఫ్ స్పిన్నర్ గా రాణించారు. 70ల్లో ముంబయి తరఫున 52 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడిన ఆయన 126 వికెట్లు తీశారు. 2006లో ముంబయిలో నిర్వహించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆర్గనైజింగ్ కమిటీలోనూ భాగస్వామ్యం అయ్యారు. క్రికెట్ లో రిటైర్ అయ్యాక మిలింద్ సెలక్టర్ గా, మెంటార్ గానూ సేవలు అందించారు. ఎంతో మంది క్రికెటర్లు స్ఫూర్తిగా నిలుస్తూ వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ముంబయి క్రికెట్ అసోసియేషన్ లో ఎన్నో సేవలు అందించారు. మేనేజింగ్ కమిటీ మెంబర్, సెలక్టర్, కామెంటేటర్, ఆ తర్వాత అడ్వైజర్ గానూ నియమితులయ్యారు.
