మూడో రోజు లంచ్ విరామానికి
దీంతో మూడో రోజు లంచ్ విరామానికి పృథ్వీ షా 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో వచ్చే ఏడాది న్యూజిలాండ్తో జరగనున్న టెస్టు సిరిస్లో మూడో టెస్టు ఓపెనర్గా తాను ఉన్నట్లు సెలక్టర్లు తెలియజేశాడు. బరోడా తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులకే ఆలౌట్ కావడంతో ముంబై 124 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన ముంబై
మూడో రోజైన మంగళవారం తొలి సెషన్లో ముంబై ఒకే ఒక్క వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పృథ్వీ షా సెంచరీతో చెలరేగడంతో లంచ్ విరామానికి 314 పరుగుల ఆధిక్యంలోనికి దూసుకెళ్లింది. ఇటీవలే తన 20వ పుట్టినరోజు నాడు తన ట్విట్టర్లో ప్రపంచ క్రికెట్లో కొత్త పృథ్వీ షాను చూస్తారని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ముస్తాక్ అలీ ట్రోఫీలో సైతం
రంజీ ట్రోఫీకి ముందు జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సైతం పృథ్వీ షా మెరుపులు మెరిపించాడు. గతేడాది వెస్టిండిస్తో జరిగిన టెస్టు సిరిస్లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన పృథ్వీ షా తన తొలి టెస్టులోనే సెంచరీ సాధించాడు. ఇక, రెండో టెస్టులో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు.
గతేడాది ఆసీస్ పర్యటనలో గాయపడ్డ షా
అయితే, ఆసీస్ పర్యటనలో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్లో పృథ్వీ షా కాలికి గాయమైంది. దీంతో అతడు ఆ సిరిస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకుని స్వదేశానికి తిరిగొచ్చాడు. దీంతో అతడి స్థానంలో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్ రాణించడంతో భారత టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
మయాంక్ అగర్వాల్ సెంచరీలు
ఇటీవలే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లతో ముగిసిన టెస్టు సిరిస్ల్లో మయాంక్ అగర్వాల్ సెంచరీలతో చెలరేగడంతో టెస్టు జట్టులో తన స్థానానికి ఢోకా లేకపోయింది. ఇక, దక్షిణాఫ్రికా సిరిస్తో రోహిత్ శర్మను ఓపెనర్గా జట్టు మేనేజ్మెంట్ పరీక్షించగా అతడు కూడా విజయవంతమయ్యాడు. దీంతో పృథ్వీ షాని మూడో ఓపెనర్గా టీమిండియా రిజర్వ్లో పెట్టుకునే అవకాశం కలిగింది.