For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్‘విన్’ అసామాన్య బ్యాటింగ్.. చెన్నై నుంచి విజయాన్ని లాక్కున్నాడు

Rajasthan won by 5 wickets over Chennai thanks to Ashwin brilliant batting performance.

చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 151పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లు పట్టుదలతో పోరాడారు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (59పరుగులు 44బంతుల్లో 8ఫోర్లు 1సిక్సర్) రాణించడంతో పాటు చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (40పరుగులు 23బంతుల్లో 2ఫోర్లు 3సిక్సర్లు నాటౌట్) వీరోచితంగా పోరాడి రాజస్థాన్‌ను 5వికెట్ల తేడాతో గెలిపించాడు. రియాన్ పరాగ్(10)తో కలిసి అశ్విన్ రాజస్థాన్‌ను విజయతీరాలకు అద్భుతంగా చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అశ్విన్ సొంతమైంది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 18పాయింట్లతో 2వ స్థానంతో పాటు టాప్ 2బెర్త్ ఖాయం చేసుకుంది. దీంతో క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ తలపడనుంది. ఇక చెన్నై బౌలర్లు సైతం చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినప్పటికీ అశ్విన్ చివర్లో చెలరేగి చెన్నై విజయవకాశాలపై నీళ్లు చల్లాడు. చెన్నై బౌలర్లలో సిమ్రాన్ జిత్ సింగ్ 1, మొయిన్ అలీ 1, సాంట్నర్ 1, ప్రశాంత్ సోలంకి 2 వికెట్లు తీశారు.

 ఆదిలోనే బట్లర్ ఔటయినా

ఆదిలోనే బట్లర్ ఔటయినా

ఛేదనలో రాజస్థాన్‌కు తొలి ఓవర్లో తొలి రెండు బంతులు ఫోర్లు బాది యశస్వి జైశ్వాల్ మంచి మూమెంటమ్ ఇచ్చాడు. కానీ రెండో ఓవర్లో సిమర్జీత్ సింగ్ బౌలింగ్లో ప్రమాదకర బట్లర్ (2)ఔటవ్వడంతో రాజస్థాన్‌కు గట్టిదెబ్బే తగలింది. అయినప్పటికీ యశస్వి జైశ్వాల్ మాత్రం అడపాదడపా ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును నడిపించాడు. కెప్టెన్ శాంసన్ కూడా అతనికి జత కలవడంతో రన్ రేట్ మెయింటెన్ చేయగలిగారు. ఈ క్రమంలో వీరిద్దరి జోడీ 50పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ జోడీని తొమ్మిదో ఓవర్లో సాంట్నార్ విడదీశాడు. శాంసన్‌ను (15పరుగులు 20బంతుల్లో) కాట్ అండ్ బౌల్డ్‌గా ఔట్ చేశాడు. ఆ తర్వాత 12ఓవర్లో పడిక్కల్ (3)ను మొయిన్ అలీ ఔట్ చేశాడు.

 అశ్విన్ వీరోచిత పోరాటానికి తలవంచిన చెన్నై

అశ్విన్ వీరోచిత పోరాటానికి తలవంచిన చెన్నై

ఇక మిడిలార్డర్లో దిగిన అశ్విన్ బాధ్యతాయుతంగా ఆడాడు. 14వ ఓవర్లో తన ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జైశ్వాల్.. 15వ ఓవర్లో సోలాంకి బౌలింగ్లో సిక్స్ కొట్టాడు. తర్వాత క్యాచ్ ఔటయ్యాడు. ఇక చివరి 5ఓవర్లో 47పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొనగా.. 17వ ఓవర్లో సొలాంకి ప్రమాదకర హెట్ మయర్ (6)ను క్యాచ్ అవుట్ చేశాడు. ఇక రియాన్ పరాగ్‌తో కలిసి అశ్విన్ మాత్రం వీరోచితంగా పోరాడాడు. ఆ ఓవర్ చివరి బంతికి సిక్స్ బాదిన అశ్విన్.. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అశ్విన్ పోరాటానికి చివరి ఓవర్లో ఆర్ఆర్ కేవలం 7పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక చివరి ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను అశ్విన్ ఆర్‌ఆర్ చేతుల్లోకి తీసుకొచ్చాడు. ఇక మతీషా పతిరన వైడ్ వేయడంతో ఆర్ఆర్ మరో రెండు బంతులు ఉండగానే గెలిచింది. ఇక ఈ విజయంతో టాప్ 2పొజిషన్‌కు చేరుకున్న రాజస్థాన్ క్వాలిఫయర్ 1లో గుజరాత్ తో తలపడనుంది.

అంతకుముందు చెలరేగిన మొయిన్ అలీ

అంతకుముందు చెలరేగిన మొయిన్ అలీ

మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈ ఐపీఎల్ 2022 సీజన్‌లో తన చిట్టచివరి మ్యాచ్‌‌లో తలపడగా.. టాస్ గెలిచిన ధోనీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ 6వికెట్లు కోల్పోయి 150పరుగులు చేసింది. తద్వారా రాజస్థాన్‌‌కు 151పరుగుల టార్గెట్ విధించింది. చెన్నై బ్యాటర్లలో మొయిన్ అలీ (93పరుగులు 57బంతుల్లో 13ఫోర్లు, 3సిక్సర్లు) వీరవిహారం చేశాడు. కానీ మిగతా బ్యాట్స్ మెన్ నుంచి అంతగా సపోర్ట్ లేకపోవడంతో చెన్నై తక్కువ స్కోరుకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, అశ్విన్ తలా ఒక వికెట్ తీయగా, మెక్ కాయ్, చాహల్ తలా రెండు వికెట్లు తీశారు.

Story first published: Friday, May 20, 2022, 23:32 [IST]
Other articles published on May 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+