సరైన వేదికగా డీవై పాటిల్ స్టేడియం
ఆర్ఆర్ ఫ్రాంచైజీ.. వార్న్ జీవితాన్ని, అతన్ని స్మరించుకోవడానికి డీవై పాటిల్ స్టేడియం సరైన వేదిక అని భావించింది. అయితే ఆర్ఆర్ ఫ్రాంచైజీ కేవలం దీన్ని సంతాపం తెలియజేసే సందర్భంగానే కాకుండా.. ఓ గొప్ప క్రికెటర్ను స్మరించుకోవడానికి అతని మాటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది జీవితాలను ప్రభావితం చేయడానికి, క్రికెట్ ఆటకు ఆయన చేసిన ఎనలేని కృషికి సెల్యూట్ చేయడానికి సరైన వేదికగా భావిస్తోంది.
షేన్ వార్న్ ఫ్యామిలీకి ఆహ్వానం
షేన్ వార్న్ను స్మరించుకునే కార్యక్రమం ఆర్ఆర్ ఫ్రాంచైజీ ఆధ్వర్యంలో జరగనుంది. దీనికి బీసీసీఐ, అధికారిక బ్రాడ్కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ కూడా తమ సహకారాన్ని అందించనున్నాయి. ఈ సందర్భంగా బీసీసీఐకి, స్టార్ స్పోర్ట్స్ వారికి ఆర్ఆర్ ఫ్రాంఛైజీ కృతజ్ఞతలు తెలియజేసింది. వార్న్ను ఆరాధించేవారికి, అతని నుంచి క్రికెట్ నైపుణ్యాలు నేర్చుకున్నవారికి, అతనితో కలిసి ఆడిన మాజీ, ప్రస్తుత క్రికెటర్లకు, అభిమానులకు ఈ స్మరణ కార్యక్రమం ముఖ్యమైన సందర్భం కానుందని ఫ్రాంఛైజీ పేర్కొంది. అలాగే వార్న్ కుటుంబానికి కూడా ఈ మేరకు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించింది. అతని సోదరుడు జాసన్ వార్న్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడు. ఈ కార్యక్రమాన్ని రాజస్థాన్ రాయల్స్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో లైవ్ ప్రసారం చేయనుంది. అలాగే స్టార్ స్పోర్ట్స్ కూడా ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా రాజస్థాన్ ప్లేయర్లు తమ జెర్సీ కాలర్ పైనా, ప్లేయింగ్ కిట్లపైనా 'SW23' అనే స్టిక్కర్లు పెట్టుకోనున్నారు. దీని మీనింగ్ షేన్ వార్న్, అతని జెర్సీ నంబర్ 23. అలాగే స్టేడియంలో షేన్ వార్న్ ట్రిబ్యూట్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేయనున్నారు.
తొలి ఐపీఎల్ వివరాలు
2008లో ఐపీఎల్ తొలి సీజన్లో ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది. ఈ సీజన్లో వార్న్ కెప్టెన్గా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవగా.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా షాన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్ను పొందాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సోహిల్ తన్వీర్ పర్పుల్ క్యాప్ని పొందాడు. షేన్ వాట్సన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. ఫైనల్లో యూసుఫ్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.