
నిరుడు మే 13వ తేదీన సంభవించిన బాంబు పేలుళ్ల బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆరు కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ఐపియల్ సీజన్ సందర్భంగా నిరుడు లలిత్ మోడీ ప్రకటించారు. అయితే ఈ నిధులు అందించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నాగరిక్ మోర్చా అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు లలిత్ మోడీపై కేసు నమోదు చేశారు.