దుబాయ్: 2015 సంవత్సరంలో ప్రియాంక తన జీవిత భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందని భారత క్రికెటర్ సురేశ్ రైనా పేర్కొన్నాడు. ప్రియాంకను రైనా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం ఆరంభం నేపథ్యంలో రైనా ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
ప్రియాంకను పెళ్లి చేసుకొని తాను సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు. ప్రియాంక రాక తమ కుటుంబంలో ఆనందం, గర్వం తొణికిసలాడుతోందని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. థ్యాంక్యూ 2015 అంటూ పేర్కొన్నాడు. అభిమానులకు, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు.

2015లో తనకు సంతోషకరమైన గుర్తులు అంటూ పలు ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అమితాబ్ బచ్చన్తో ఉన్న ఫోటో, పెళ్లి ఫోటో ఇలాంటి పలు ఫోటోలు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. సురేష్ రైనా 2015 జర్నీ అంటూ ఓ వీడియో కూడా ఉంది.
కాగా, నూతన సంవత్సరం సందర్భంగా సురేష్ రైనా సుఘర్ ఫ్రీ కేక్స్ను లాంచ్ చేశాడు. బ్లెండ్స్ అండ్ బ్రూస్ కాఫీ షాప్ (దుబాయ్)లో లాంచ్ చేశాడు. అతనిని చూసేందుకు చాలామంది ఎగబడ్డారు. అతనితో సెల్ఫీలు తీసుకున్నారు. ఆటో గ్రాఫ్ తీసుకున్నారు.