
మూడుసార్లు వెయ్యికి పైగా పరుగులు
గతంలో వెస్టిండిస్కు చెందిన బ్రియాన్ లారా, ఇంగ్లాండ్కు చెందిన ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, ట్రెస్కోథిక్ మాత్రమే వరుసగా మూడుసార్లు వెయ్యికి పైగా పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హేడెన్ ఐదు కేలండర్ ఇయర్లలో వరుసగా వెయ్యి పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు.

రెండు బాక్సింగ్ డే టెస్టులు కలిపి స్మిత్ 410
ఇదిలా ఉంటే 2014లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్పై 192, 14 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, 2015లో వెస్టిండిస్పై 134, 70 పరుగులు చేశాడు. తద్వారా రెండు బాక్సింగ్ డే టెస్టులు కలిపి స్మిత్ 410 పరుగులు చేయడం విశేషం. వర్షం కారణంగా రెండో టెస్టుకి పలుమార్లు అంతరాయం ఏర్పడింది.

తొలి ఇన్నింగ్స్ను 443/9 వద్ద డిక్లేర్ చేసిన పాకిస్థాన్
రెండో టెస్టులో పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్లో అజహర్ అలీ డబుల్ సెంచరీని చేయగా, సోహైల్ ఖాన్, అసద్ షఫీఖ్ అర్ధసెంచరీలను నమోదు చేశారు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అజహర్ అలీ డబుల్ సెంచరీ సాధించడంతో ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి పాక్ క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు.

ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 465 పరుగులు
అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 465 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ 144 పరుగులతో సెంచరీ చేయగా, ఆ తర్వాత స్టీవ్ స్మిత్(100 నాటౌట్)తో క్రీజులో ఉన్నాడు. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో ఉంది.


Click it and Unblock the Notifications











