చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా టీమిండియాకు అభినందనాలు తెలిపారు. పాకిస్థాన్ పై అద్భుత విజయం సాధించారని కొనియాడారు. "ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ కప్ లో పాకిస్థాన్పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసినందుకు టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని ట్వీట్ చేశాడు.
జై షా
బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియా విజయంపై స్పందించాడు. విరాట్ కోహ్లీ కాలాన్ని వెనక్కి మళ్లించాడు. అతనో ఛేజ్ మాస్టర్ అని చెప్పాడు. " కాలాన్ని వెనక్కి మళ్లిస్తోంది! ఛేజ్ మాస్టర్.. కోహ్లీ తిరిగి వచ్చాడు, అతని నైపుణ్యాలను మ్యాచ్ లో బాగా చూపాడు" అని ట్వీట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
కోహ్లీ
160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహల్ తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందొచ్చిన అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. కానీ కోహ్లీ ఒంటి చేతితో మ్యాచ్ ను గెలిపించాడు. కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.


Click it and Unblock the Notifications












