
ధోని, యువీల భవితవ్యంపై ద్రవిడ్
ఈ నేపథ్యంలో వీరి భవితవ్యంపై సెలెక్టర్లు, మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని ద్రవిడ్ స్పష్టం చేశాడు. వరల్డ్ కప్కు రెండేళ్లు కూడా సమయం లేని నేపథ్యంలో ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలవ్వాలని, కాబట్టి ధోని, యువీల విషయంలో సెలక్టర్లు స్పష్టతతో ఉండాలని పేర్కొన్నాడు.

ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి
'సెలక్టర్లు ఆ ఇద్దరి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రెండేళ్ల తర్వాత వీళ్ల పాత్రను ఎలా చూడబోతున్నారన్నది ముఖ్యం. అప్పటికీ ఈ ఇద్దరికీ జట్టులో చోటుంటుందా? లేక ఒకరు మాత్రమే ఉంటారా? వారి సామర్థ్యాన్ని మరోసారి అంచనా వేయడానికి సంవత్సరం పడుతుందా.. లేక ఆరు నెలలా?' అని ప్రశ్నల వర్షం కురిపించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో 4, 5 స్థానాల్లో బ్యాటింగ్
అంతేకాదు ఈ ఇద్దరికీ అవకాశం కల్పించే ముందు యువ ప్రతిభను పరీక్షించాలనుకుంటున్నారా? అని ద్రవిడ్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 4, 5 స్థానాల్లో యువరాజ్, ధోనిలు బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయారు. ఫైనల్లో ఓటమి నేపథ్యంలో ఈ ఇద్దరిపై వేటు వేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.

యువ క్రికెటర్లకు అవకాశం
దీంతో పాటు జూన్ 23(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్ సిరీస్ కోసం పూర్తిస్థాయి జట్టును ప్రకటించినప్పటికీ.. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం ద్వారా ఇకనైనా ప్రయోగాలు చేయాలని ఆయన జట్టు మేనేజ్మెంట్కు రాహుల్ ద్రవిడ్ సూచించాడు. ఇప్పుడు అవకాశాలు ఇవ్వకుండా.. ఏడాదో, ఆరు నెలల తర్వాతో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు చింతిస్తే ప్రయోజనం ఉండదని ద్రవిడ్ అన్నాడు.


Click it and Unblock the Notifications