ముంబై: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మరో బాధ్యతను తన భుజాలపై వేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని ప్రతిష్టాత్మక జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల పాటు ద్రవిడ్ ఈ పదవిలో కొనసాగనున్నారు. దీంతో ద్రవిడ్ ఇక భారత జూనియర్ కోచ్గా కొనసాగడు.
జాతీయ క్రీడా పురస్కారాలు.. బజరంగ్, జడేజాలు గైర్హాజరు!!
ద్రవిడ్ స్థానంలో భారత్-ఎ, అండర్-19 కోచ్లుగా సితాంశు కోటక్, పరాస్ మాంబ్రే బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే కొన్ని నెలల కోసమే వీరిని నియమించినట్లు సమాచారం తెలుస్తోంది. సహాయక సిబ్బందిలో అంతర్గత పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ద్రవిడ్ స్థానంలో ఈ ఇద్దరు కోచ్లుగా నియమితులయ్యారు. కోటక్ 130 ఫస్ట్క్లాస్ మ్యాచ్లో 41.76 సగటుతో 8061 పరుగులు చేశాడు. కోటక్ భారత్-ఎ బ్యాటింగ్పై దృష్టిపెడతాడు. బౌలింగ్ కోచ్గా రమేశ్ పొవార్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ పనిచేయనున్నారు.
మరోవైపు మాంబ్రే అండర్-19 కోచ్గా పనిచేయనున్నారు. మాంబ్రే ఇప్పటికే ద్రవిడ్తో కలిసి చేశాడు. మాంబ్రే 91 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 284 వికెట్లు పడగొట్టాడు. ఎన్సీఏలో ద్రవిడ్ ఎక్కువ సమయం గడిపేందుకు.. అతనిపై భారం పడకూడనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
షోయబ్ అక్తర్కు శస్త్రచికిత్స.. నొప్పిగా ఉందంటూ వీడియో పోస్టు!!
దేశంలో యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడంతో పాటు జూనియర్ క్రికెట్ రోడ్ మ్యాప్లో ద్రవిడ్ కీలకం కానున్నారు. భవిష్యత్లో మహిళల క్రికెట్ను పర్యవేక్షించడానికి తోడు ఎన్సీఏతో పాటు జోనల్ క్రికెట్ అకాడమీలకు కోచ్లను నియమించనున్నారు. గాయపడ్డ క్రికెటర్లకు ఎన్సీఏలో చేపట్టే పునరావాస కార్యక్రమాలకు నేతృత్వం వహించనున్నారు.